Home » Medical News
కంటిచూపు సమస్యలన్నీ కంటికి మాత్రమే పరిమితమై ఉండవు. చాలామందికి మెదడులో సమస్యల వల్ల కూడా చూపు తేడా వస్తుంది. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ వంటివాటితో బాధపడేవారిలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి.
మీరు ఎల్లప్పుడూ ఔషధాలు తీసుకుంటున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వ తనిఖీల్లో 84 బ్యాచ్ల మందులు విఫలమయ్యాయి. వాటిలో కొలెస్ట్రాల్, డయాబెటిస్, ఎసిడిటీ సహా పలు వ్యాధుల మందులు ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గురువారం పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యులకు పదోన్నతులు కల్పించాలని, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ను సెకండరీ గ్రేడ్ హెల్త్ సర్వీసె్సగా మార్చాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కోరింది.
విధులకు డుమ్మా కొట్టే డాక్టర్లు, వైద్య సిబ్బంది విషయంలో కఠినంగా వ్యవహరించాలని సర్కారు భావిస్తోంది. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,869 ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు పరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
‘కొలోరెక్టల్ క్యాన్సర్కు సరికొత్త శస్త్రచికిత్స, కీమోథెరపీలు అందుబాటులోకి వచ్చాయని, ఇంతకుముందు ఆ వ్యాధిగ్రస్తులు ఎవరికైనా ఒకే రకమైన చికిత్స చేసేవాళ్లం.
క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ముప్పును ముందే గుర్తిస్తే.. వాటిని రాకుండా అడ్డుకోవచ్చని ఒమేగా ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ మోహన్ వంశీ అన్నారు.
నిమ్స్లో ఓపీ స్లిప్ల కోసం గంటల తరబడి నిరీక్షించే పరిస్థితికి త్వరలోనే చెక్ పడనుంది. ఇందుకోసం నిమ్స్ మిలీనియం బ్లాక్ వద్ద ప్రయోగత్మకంగా ఒక కియోస్క్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.
ప్రపంచానికి హైదరాబాద్ వైద్య రాజధానిగా మారు తోంది. ఏటా వేలాది మంది విదేశీయులు హైదారా బాద్కు వచ్చి చికిత్సలు పొందుతున్నారు. హైదరాబా ద్లోని ఆసుపత్రుల్లో ఉన్న వైద్య నిపుణులు ఎంతో కఠినమైన, సున్నితమైన శస్త్ర చికిత్సలు చేసి వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు.
సున్తీ అనంతరం వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా.. నాలుగేళ్ల వయసులోనే పురుషాంగాన్ని కోల్పోయిన సోమాలియా యువకుడికి మెడికవర్ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు!