Home » Medaram Jatara
Telangana: జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం పగిడిద్దరాజు మేడారం బయలుదేరనున్నారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరి వెళ్లనున్నారు.
మేడారం(Medaram) జాతర ఎఫెక్ట్తో నగరంలోని సిటీబస్సు ప్రయాణికులకు ఇక్కట్లు తప్పేట్లు లేవు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరకు గ్రేటర్ జోన్నుంచి 1800 సిటీబస్సులను నడిపించాలని నిర్ణయించారు.
మేడారం మహా జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? రోడ్డు, రైలు మార్గాల ద్వారా ట్రాఫిక్, రద్దీని తట్టుకొని గంటలకొద్దీ ప్రయాణం అని జంకుతున్నారా?
ములుగు జిల్లా మేడారంలో ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
మేడారం(Medaram) జాతరకు 800కు పైగా సిటీబస్సులు తరలివెళ్లనున్నాయి. 21 నుంచి 24 వరకు జరిగే జాతర కోసం గ్రేటర్జోన్లోని పలు డిపోల నుంచి దశలవారీగా బస్సులను తరలించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు సమాచారం.