Home » Medaram Jatara
ములుగు: మేడారం మహాజాతర బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. మహాజాతరలో ఈరోజు తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఆదివాసి సంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తరలిస్తారు. ఈఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారంకు పోటెత్తారు. భక్తకోటి మూట, ముల్లే కట్టుకుని మేడారం వైపు అడుగులు వేస్తున్నారు.
Telangana: జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం పగిడిద్దరాజు మేడారం బయలుదేరనున్నారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరి వెళ్లనున్నారు.
మేడారం(Medaram) జాతర ఎఫెక్ట్తో నగరంలోని సిటీబస్సు ప్రయాణికులకు ఇక్కట్లు తప్పేట్లు లేవు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరకు గ్రేటర్ జోన్నుంచి 1800 సిటీబస్సులను నడిపించాలని నిర్ణయించారు.
మేడారం మహా జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? రోడ్డు, రైలు మార్గాల ద్వారా ట్రాఫిక్, రద్దీని తట్టుకొని గంటలకొద్దీ ప్రయాణం అని జంకుతున్నారా?
ములుగు జిల్లా మేడారంలో ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
మేడారం(Medaram) జాతరకు 800కు పైగా సిటీబస్సులు తరలివెళ్లనున్నాయి. 21 నుంచి 24 వరకు జరిగే జాతర కోసం గ్రేటర్జోన్లోని పలు డిపోల నుంచి దశలవారీగా బస్సులను తరలించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు సమాచారం.