Home » Maoist Encounter
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తొలిసారిగా లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిందని మావోయిస్టులు లేఖలో తెలిపారు.
Encounter: ఛత్తీస్గఢ్లో గత వారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు బుర్రా రాకేష్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించే విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఐదు రోజులుగా రాకేష్ మృత దేహం కోసం అతని బంధువులు ఎదురుచూస్తున్నారు.
విజయవాడలో సీపీఐ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మానించారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.
నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు సృష్టిస్తున్నారని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు వారు సీఎం, హోంమంత్రికి లేఖ రాశారు.
ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టుగా మారిన కర్నూలు మహిళ లలిత మృతి చెందింది. ఆమె గతంలో నర్సుగా ఉద్యోగం చేసి, ఆపై మావోయిస్టు ఉద్యమంలో చేరింది.
ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సజ్జా నాగేశ్వరరావుల మృతదేహాల కోసం ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించాలంటూ హైకోర్టు కుటుంబ సభ్యులకు సూచించింది. మృతదేహాల అప్పగింతపై నిర్ణయం స్థానిక పోలీసులకే వదిలింది.
Jharkhand Naxal Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఝార్ఖండ్లోని లతేహార్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర పోరాటం జరిగింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత హతమయ్యాడు.
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. మావోయిస్టు అగ్రనేత సహా 27 మంది మృతి చెందిన ఈ ఘటనను హత్యలుగా అభివర్ణించారు.
వరంగల్ ఆర్ఈసీ... దేశ, విదేశాల్లోని అనేక ప్రముఖ సంస్థల్లో విజయవంతంగా పని చేసిన తెలుగు ఇంజనీరింగ్ నిపుణులను అందించిన ఘనత ఈ విద్యా సంస్థకు దక్కుతుంది. మరోవైపు పీపుల్స్వార్ గ్రూప్లో అనేక మంది సమర్థులైన నాయకులు కూడా ఇదే సంస్థ నుంచి వచ్చారు.
Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.