Home » Maoist Encounter
మావోయిస్టులను ఎన్కౌంటర్లో చంపిన తర్వాత వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులు దహనం చేయడాన్ని సామాజికవేత్తలు, వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, విచారణ కోరుతూ జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
Big Shock:చత్తీస్గడ్లో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. నలుగురు కీలక మావోయిస్టు నేతలతో పాటు మరో 18 మంది సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్, పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల ముందు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారికి పోలీసులు నియాద్ నెల్లా నార్ యోజన కింద పునరావాసం కల్పించనున్నారు.
చత్తీస్గఢ్ అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి పార్థివదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని కేంద్రం, చత్తీస్గఢ్ప్రభుత్వాలను మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని బంధుమిత్రులు విజ్ఞప్తి చేసినా.. ప్రజా సంఘాలు డిమాండ్లు చేసినా.. ఛత్తీస్గఢ్ పోలీసులు వీటిని పట్టించుకోలేదు.
చత్తీగఢ్లో నక్సల్ నేత నంబాల కేశవరావు సహా ఆరు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు బంధుమిత్రుల లేకపోవడంతో తమంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు మరియు ప్రజాసంఘాలు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తొలిసారిగా లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిందని మావోయిస్టులు లేఖలో తెలిపారు.
Encounter: ఛత్తీస్గఢ్లో గత వారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు బుర్రా రాకేష్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించే విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఐదు రోజులుగా రాకేష్ మృత దేహం కోసం అతని బంధువులు ఎదురుచూస్తున్నారు.
విజయవాడలో సీపీఐ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మానించారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.
నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు సృష్టిస్తున్నారని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు వారు సీఎం, హోంమంత్రికి లేఖ రాశారు.
ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టుగా మారిన కర్నూలు మహిళ లలిత మృతి చెందింది. ఆమె గతంలో నర్సుగా ఉద్యోగం చేసి, ఆపై మావోయిస్టు ఉద్యమంలో చేరింది.