Home » Maoist Encounter
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ 7,500 మంది సంతకాలతో ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ప్రతినిధులు వెల్లడించారు.
నాలుగు దశాబ్దాల అజ్ఞాతాన్ని వీడి.. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు కాకరాల సునీత, చెన్నూరి హరీశ్లకు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు గురువారం చెక్కులను అందజేశారు.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మావోల కాల్పుల్లో ఇద్దరు సైనికులకు సైతం తీవ్రగాయాలు అయ్యాయి.
ఇటీవల ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని.. పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఏపీ పోలీసులు ఫీల్డ్ లెవల్లో బాగా పని చేసి మంచి ఫలితాలు చూపించారని చెప్పుకొచ్చారు. వయలెన్స్ పోతేనే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమవుతుందని.. అందుకే వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టులకి కూడా నేడు రివార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు. మావోయిస్టులు పునరాలోచన చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.
అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మఢ్ అడవుల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
హైదరాబాద్, జూలై 16: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ అంగీకరించింది.
Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు వార్నింగ్ ఇస్తూ వారం క్రితం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ఇటీవల కలకలం సృష్టించింది. అయితే, ఈ లేఖకు సంబంధించి మావోయిస్టు పార్టీ తాజాగా మరో సంచలన లేఖ విడుదల చేసింది.
Bijapur Encounter: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.
Encounter: భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రగాయాలపాలైనట్లు తెలుస్తోంది.
దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు..! ‘ఆపరేషన్ కగార్’తో చతికిలపడి.. నక్సలిజం, ఆ తర్వాత మావోయిజం చరిత్రలోనే ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి(నంబాల కేశవరావు)ని కోల్పోవడానికి కారకులైన ఇన్ఫార్మర్లపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు.