Home » Mangalagiri
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పేదలకు అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాల ఆశ చూపించి ఓట్లు పొందాలని వైసీపీ వేసిన ఎత్తుకు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ పైఎత్తు వేశారు. నియోజకవర్గంలోని 20 వేల మంది పేదలకు అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని శనివారం స్పష్టమైన హామీ ఇచ్చారు.
ప్రతిసారీ పోలీసులు వచ్చి ఏదో చేస్తారని ఆశించవద్దు. మన కళ్ల ముందు అన్యాయం జరిగితే ప్రశ్నించండి. అందరూ కలిసి సంఘటితంగా పోరాటం చేయండి. మన డబ్బుతో.. మన పన్నులతో పాలన సాగిస్తూ మనల్ని శాసిస్తున్నారు. పన్నులు కట్టకపోతే మనకు నోటీసు ఇస్తారు. దురాక్రమణ చేసినా..
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అధికారపక్షం ఏదోరకంగా అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది.
అమరావతి: తనపై అసత్య ప్రచారం చేసినవారిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో భారీ స్కామ్ జరిగిందని మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి చేసిన ఆరోపణలపై లోకేష్ పరువునష్టం దావా వేశారు.
తనపై వచ్చిన అసత్య ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. సాక్షి, అజయ్ రెడ్డిపై మరో న్యాయ పోరాటం చేస్తున్నారు. అసత్య కథనాలపై క్రిమినల్ కేసులు పెట్టారు. శుక్రవారం లోకేష్ మంగళగిరి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు.
గుంటూరు జిల్లా: వైసీపీ అసత్య ప్రచారంపై టీడీపీ యువనేత నారా లోకేష్ న్యాయపోరాటం ప్రారంభించారు. ఏపీ అటవీ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీసీ ఎమ్మెల్సీ పోతుల సునీతపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్ని వర్గాల వారికి వంగవీటి మోహనరంగా అండగా నిలిచారని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. పాతురులో రంగా విగ్రహావిష్కరణలో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. పాతూరులో తన తండ్రి, పెదనాన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ విగ్రహాలకు ఎమ్మెల్యే ఆర్కే సహకారం అందించారని వెల్లడించారు. ఒక నాయకుడు మరణించి మూడు దశాబ్దాలు దాటినా స్మరిస్తూనే ఉన్నారని.. తనది మానవ కులం అని చాటి చెప్పిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అని గుర్తుచేశారు.