• Home » Mangalagiri

Mangalagiri

AP News: పిన్నెల్లి బాధితుడు నోముల మాణిక్యాల రావు ఫిర్యాదు.. నిరాకరించిన మంగళగిరి పోలీసులు

AP News: పిన్నెల్లి బాధితుడు నోముల మాణిక్యాల రావు ఫిర్యాదు.. నిరాకరించిన మంగళగిరి పోలీసులు

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత నోముల మాణిక్యాల రావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు.

AP News: మంగళగిరి ఎస్‌ఐపై వేటు.. కారణమిదే!

AP News: మంగళగిరి ఎస్‌ఐపై వేటు.. కారణమిదే!

Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో పోలీసుల తీరు ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఇప్పటికీ డీజీపీ స్థాయి నుంచి ఎస్‌ఐ వరకు ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈసీ చర్యలతో పోలీసుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసు అధికారుల వరుస బదిలీలు, సస్పెన్షన్లు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

Pawan Kalyan: మంగళగిరిలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మంగళగిరిలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

గుంటూరు జిల్లా: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

TDP:  ఓటింగ్‌లో స్త్రీ శక్తి సత్తా చాటాలి: నారా భువనేశ్వరి

TDP: ఓటింగ్‌లో స్త్రీ శక్తి సత్తా చాటాలి: నారా భువనేశ్వరి

అమరావతి: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ( చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి) మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

AP Elections: మంగళగిరి ప్రజలకు లోకేష్ బహిరంగ లేఖ

AP Elections: మంగళగిరి ప్రజలకు లోకేష్ బహిరంగ లేఖ

Andhrapradesh: మంగళగిరి ప్రజలకు టీడీపీ నేత నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ‘‘పేదరికం లేని మంగళగిరి నా కల’’ అంటూ యువనేత అందులో పేర్కొన్నారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లన్నారు. కృష్ణమ్మ పరవళ్లు, ప్రకృతిసోయగాల నడుమ నిత్యనూతనంగా విరాజిల్లే సుందరమైన ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గమన్నారు.

  AP Election 2024:ఆ రెండు నియోజకవర్గాలకు జగన్ డబ్బులు పంపించారు: నారా లోకేష్

AP Election 2024:ఆ రెండు నియోజకవర్గాలకు జగన్ డబ్బులు పంపించారు: నారా లోకేష్

ఈ ఎన్నికల్లో ప్రలోభాల కోసం కుప్పం, మంగళగిరికి జగన్ రూ.300 కోట్ల చొప్పున పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ఆరోపణలు చేశారు. పాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోవాలని.. ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకు వేయాలని పిలుపునిచ్చారు.

Nara Lokesh: ఓడిన చోటే.. నిలిచి

Nara Lokesh: ఓడిన చోటే.. నిలిచి

ఓడిపోతే.. ఇక్కడ నాకెందుకులే పనంటూ ఎవరైనా పక్కకు తప్పుకుని పోతారు. కానీ నారా లోకేశ్‌ అలాకాదు. మరోసారి పోటీలో నిలిచారు.

TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి

TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం అమరాతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర పేరుతో ‘నాడు మార్నింగ్, ఈవినింగ్ వాక్’ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తులు, స్థలాలు ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు.

TDP: చంద్రబాబు నివాసానికి వచ్చిన గిడ్డి ఈశ్వరి, ఎంఎస్ రాజు, రఘురామ..

TDP: చంద్రబాబు నివాసానికి వచ్చిన గిడ్డి ఈశ్వరి, ఎంఎస్ రాజు, రఘురామ..

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బీ.ఫామ్స్ ఇస్తున్నారు.

Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి

Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి

Andhrapradesh: మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామంలో మిర్చి కార్మికులతో బ్రహ్మణి భేటీ అయ్యారు. కార్మికుల సమస్యలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆపై మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని బ్రాహ్మణి సందర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి