Home » Mamata Banerjee
కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేయడానికి టీఎంసీ అధినేత్రి మమత వెళ్లనున్నారు.
గతేడాది(2023) రాష్ట్రపతి ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల(New Criminal Laws) అమలును వాయిదా వేయాలని కోరుతూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి(PM Modi) శుక్రవారం లేఖ రాశారు. సభలో ఎలాంటి చర్చ లేకుండానే వీటిని ఆమోదించారని.. చట్టాలపై మరోసారి సమీక్ష జరపాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
రాజ్భవన్లో తనకు భద్రత లేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్(CV Anand Bose) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంలో పూర్తిగా బెంగాల్(West Bengal) పోలీసులే మోహరించి ఉన్నారని పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కంచన్జంగ ఎక్స్ప్రెస్ను గూడ్సు రైలు ఢీకొని 15 మంది మృతి చెందిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లోని రంగపాణి స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది.
పశ్చిమ బెంగాల్లోని(west bengal) డార్జిలింగ్ జిల్లాలో కాంచన్జంగా ఎక్స్ప్రెస్(Kanchanjungha Express), గూడ్స్ రైలు ఢీకొనడంతో ఘరో ప్రమాదం(train accident) జరిగింది. ఈ ఘటనలో వార్త రాసే సమయానికి 15 మంది మరణించగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన, గాయపడిన ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం పలు హెల్ప్లైన్ నంబర్లను( helpline numbers) రైల్వే అధికారులు విడుదల చేశారు.
పశ్చిమబెంగాల్లోని(West Bengal) అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు(Transgenders) ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు.. దీదీ సర్కార్ను ఆదేశించింది.
ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరికొన్ని గంటల్లోనే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు...
మీడియా ఐకాన్ రామోజీరావు ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. రామోజీ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ స్పందించారు. తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి అని కొనియాడారు. ఫిల్మ్ సిటీ సందర్శించాలని రామోజీ రావు తనను ఒకసారి ఆహ్వానించారని గుర్తుచేశారు.