Home » Mallikarjun Kharge
సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామంటూ గతంలో చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు అంతా తానే చేశానని చెప్పుకోవడం ఏమిటిని ఖర్గే ప్రశ్నించారు. సొంత గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదన్నారు.
మన సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానని, అయితే మన రక్షణ సన్నద్ధతపై నిపుణుల కమిటీతో తక్షణం ఒక సమగ్ర వ్యూహాత్మక సమీక్ష జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖర్గే అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ శుభావార్త తెలిపింది. టీపీసీసీలో పలు కమిటీలను గురువారం ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
మల్లికార్జున ఖర్గే 11 ఏళ్ల మోదీ పాలనను పీడకలగా చెప్పడం సరికాదని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమర్జెన్సీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఓ పీడకల అని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్ను అడుగు అడుగునా అడ్డుకుంది ప్రతిపక్షనేత రాహుల్ గాంధీనే అని లక్ష్మణ్ విమర్శించారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను కాల్చిచంపినందుకు ప్రతిగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టడం ఒక భారతీయురాలిగా గర్వస్తున్నానని సుప్రియా సూలే ప్రశంసించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధానికి ముందే సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ను ఆయన చిన్న యుద్ధంగా అభివర్ణిస్తూ, ప్రధాని మోదీ జవాబుదారీ తీరుని విమర్శించారు.
పహల్గాంలో ఉగ్రదాడికి మూడ్రోజుల ముందు ప్రధాని మోదీకి నిఘా సమాచారం అందింది. ఈ కారణంగా జమ్మూ-కశ్మీరు పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు, అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు.
జార్ఖాండ్లోని రాంచీలో మంగళవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావ్' ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వమే స్వయంగా అంగీకరించిందని చెప్పారు.
ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని గత సీడబ్ల్యూసీ సమావేశం స్పష్టం చేసిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా కేంద్రం ఇంతరవకూ స్పష్టమైన హ్యూహంతో ముందుకు రాలేదని అన్నారు.
ఉగ్రవాదంపై పోరుకు యావద్దేశం కలిసికట్టుగా పోరాడాలని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.