Home » Malkajgiri
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగార్ధులు, డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు టోకరా వేసి రూ.1.29 కోట్ల మేర కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
నగరంలో హెరాయిన్ విక్రయించే ముఠా ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్), శంషాబాద్ ఎస్వోటీ, మాదాపూర్ పోలీసులు కట్టించారు. ఈ ముఠా నుంచి రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్ను సీజ్ చేశారు.
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలోని ప్రాంత ప్రజలను రైల్వేచక్రబంధం నుంచి విముక్తి కలిగించడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) అన్నారు. ఆయన మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించారు.
రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే వాటి ఊసే ఎత్తడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) ఆరోపించారు.
నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని ఆర్కేపురం ప్లైఓవర్ బ్రిడ్డికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) అన్నారు. స్థానిక కార్పొరేటర్ మీనాఉపేందర్రెడ్డి, రైల్వే, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఆర్కేపురం ప్లైఓవర్ బ్రిడ్జి రోడ్డును పరిశీలించారు.
‘నేను శామీర్పేటలోనే ఉంటున్నా.. మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’ అని ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) పేర్కొన్నారు. ఈ మేర కు బుధవారం కేపీహెచ్బీ ఆరో ఫేజ్లోని మేడక కోటేశ్వరరావు, వాణిశ్రీ ఇంట్లో తేనేటీ విందుకు హాజరయ్యారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.
మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికి ఎల్లప్పుడు ముందుంటానని ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) అన్నారు. బీజేపీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్కు అభినందన కార్యక్రమాన్ని ఎఫ్సీఐ కాలనీలో నిర్వహించారు.
రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ కథ ముగిసిందని, కాంగ్రె్సపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు.