Home » Malkajgiri
దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి(Malkajigiri). ఎన్నికలు జరిగిన ప్రతీసారి మార్పు కోరుకుంటోంది. 2008లో డీలిమిటేషన్లో భాగంగా మల్కాజిగిరి కొత్త పార్లమెంట్ నియోజకవర్గంగా పురుడు పోసుకుంది.
కమలం వికసించింది.. కాంగ్రెస్ మురిసింది.. గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పెరగడంతోపాటు ఓట్ల శాతమూ21 శాతానికి ఎగబాకింది. అధికార కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. లోక్సభ ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ప్రభావం ఏమాత్రం తగ్గదని, తాము ఆశించిన 12 స్థానాల్లో అంచనాలు కొంత అటు ఇటు అయినా.. ఆరు స్థానాల్లో మాత్రం గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది.
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైనా.. తొలి రౌండ్ ఫలితం కోసం కొంత ఎదురుచూపులు తప్పవు. ఈవీఎంలు తెరవడం.. వాటిని టేబుళ్లపై చేర్చడం.. లెక్కించడం.. సరిపోల్చుకోవడం.. వాటిని రిటర్నింగ్ అధికారి నిర్ధారించుకొని ఫలితాన్ని ప్రకటించడం.. వీటన్నింటికీ గంటన్నర పట్టే అవకాశం ఉంది.
లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల(Secunderabad, Malkajigiri, Chevella) నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి మెజార్టీతో సీట్లు కైవసం చేసుకుంటామని, హైదరాబాద్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరైనా.. మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకొని తమను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థిస్తూ ఉంటారు. అందుకు పంచాయతీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు ఎవరు.. అందుకు మినహాయింపు కాదన్న సంగతి అందరికీ తెలిసిందే.
మల్కాజిగిరి నియోజకవర్గంలో వీరశైవలింగాయత్లు తమ మద్దతును బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(BJP candidate Etala Rajender)కు ప్రకటించారు. ఈ మేరకు వీరశైవలింగాయత్ సమాజం అధ్యక్షుడు ఆలూరే ఈశ్వర ప్రసాద్ మల్కాజిగిరిలోని తన నివాసంలో వీరశైవలింగాయత్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితదేనని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి(Malkajigiri MLA Marri Rajasekhar Reddy) అన్నారు.
దేశంలో మరోసారి నరేంద్రమోదీ(Narendra Modi)యే ప్రధాని అవుతారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని జేజేనగర్లోని మహాభోది ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తమిళుల ఆత్మీయ సమావేశంలో అయన మాట్లాడారు.
‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్(Hyderabad) నగరాన్ని బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధిలో ప్రపంచస్థాయిలో నిలిపింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కారు పార్టీని గెలిపించాలని నిర్ణయించుకున్నారు’ అని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) తెలిపారు.