Home » Mahesh Kumar Goud
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. దాదాపు 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నట్లు ఇప్పటికే తేలటంతో, వారి నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.
నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలపై పొంగులేటి ప్రకటనను టీపీసీసీ చీఫ్ తప్పుబట్టారు. కేబినెట్ అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ మహేష్కుమార్ మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మరో మలుపు చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) జూన్ 17న జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. పోలీసుల విచారణ ఊపందుకుంటుండగా, ఈ కేసు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
గద్దర్ అవార్డుల ప్రదానంతో సినీ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం తీసుకువచ్చిందని టీపీసీసీ చీఫ్ మహే్షకుమార్గౌడ్ వ్యాఖ్యానించారు.
తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
తమ వర్గం నేతలకు క్యాబినెట్లో స్థానం కల్పించడంతో పాటు నామినేటెడ్, పార్టీ కీలక పదవుల్లో అవకాశం కల్పించాలంటూ వివిధ కుల సంఘాల నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ప్రజాసమస్యల పరిష్కారానికి మరో వినూత్న కార్యక్రమానికి టీపీసీసీ శ్రీకారం చుట్టింది. మంగళవారం నుంచి ప్రజా ప్రతినిధుల కార్యక్రమం అందుబాటులోకి రానుంది.
ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలని హితవు పలికారు.
Mahesh Kumar Goud: కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని... వేల కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో ప్రధాని సహా పలువురు అనేక సార్లు ఆరోపణలు చేశారని మహేష్ కుమార్ గుర్తుచేశారు. కానీ ఈటెల అందుకు భిన్నంగా కమిషన్ ఎదుట ఇచ్చిన వివరణను చూస్తే కేసీఆర్తో కుమ్మక్కైనట్లు స్పష్టమైందని ఆరోపించారు.