Home » Lok Sabha
ఇటివల వెలుగులోకి వచ్చిన వీడియోలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ నేర్చుకుంటున్నట్లు కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పార్లమెంట్లో ప్రజాపద్దుల సంఘాన్ని(పీఏసీ) ఏర్పాటు చేస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ సంఘానికి నేతృత్వం వహిస్తారు.
కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం కోల్పోయిన తర్వాత పదేళ్ల పాటు ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్గాంధీ ఎంపీలు ఎన్నుకున్నారు.
ఇండియా కూటమి పక్షాల నిరసన మధ్య కేంద్రప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్సభలో మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజం మెచ్చుకునేదిగా ఉందన్నారు.
ఇక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరికాసేపట్లో లోక్సభలో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబిసి ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ ఈ కొత్త బిల్లును తీసుకు రానుంది.
పోలింగ్ శాతాల్లో భారీగా తేడాలు ఉన్నాయంటూ వస్తున్న విశ్లేషణలను ఆదివారం ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన ఓట్ల శాతానికి, తుది ఓట్ల శాతానికి మధ్య మరీ ఎక్కువగా తేడా ఉందంటూ విశ్లేషణలు వచ్చాయి.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్సభలో ‘చక్రవ్యూహం’ అంటూ తాను చేసిన ప్రసంగం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదన్నారు.
2027 మార్చి 31నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 12,616 కేంద్రాలు నెలకొల్పినట్లు ఆమె వెల్లడించారు.
ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ ప్రమాదంలో దాదాపు 160 మందికిపైగా మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం కేరళలోని వయనాడ్, ముప్పడిలో పర్యటించనున్నారు.
దేశంలో మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.13,412కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్ సభలో వెల్లడించారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా?, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు.