Home » Lok Sabha Election 2024
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్బరేలి(Raebareli), కేరళలోని వయనాడ్(Wayanad) పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఒకరు ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాలి. దీంతో రాహుల్ (Rahul Gandhi) వయనాడ్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంపై తమిళ మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని, రాజకీయ విశేషాలను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకు టీవీ చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ప్రచార సమయంలో ఓ వేదికపై ప్రధాని మోదీ చంద్రబాబు చేతులు పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్న దృశ్యాలను ప్రత్యేకంగా ప్రసారం చేశాయి.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా రెండోసారి సాధించిన విజయాన్ని పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అంకితం చేస్తున్నానని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి(Minister G Kishan Reddy) అన్నారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లా ప్రధాని హసీనాకు కేంద్ర సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు.
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రె్సకు అంచనాల కంటే తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏఐసీసీ నియమించింది. పార్టీ జాతీయ నాయకులు పీజే కురియన్, రఖిబుల్ హుసేన్, పర్గత్సింగ్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.
ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారాన్ని అందుకున్నారు. ఆ క్రమంలో త్వరలో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో శ్రీనగర్లోని దాల్ సరస్సు సమీపంలోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు.
ఈవీఎంల కారణంగానే జేడీఎస్, బీజేపీలకు ఆశించినంతకంటే ఎక్కువ లోక్సభ స్థానాలు వచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) ఆరోపించారు. బీబీఎంపీ కార్యాలయంలో గ్యారెంటీల అమలు కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేడర్పై అధికార టీఎంసీ శ్రేణులు వరుసగా దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులపై బీజేపీ అగ్రనాయకత్వం నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ విచారణ కమిటి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది. ఆ క్రమంలో విచారణ బృందం ఎదుట బీజేపీ కేడర్ మంగళవారం ఆందోళనకు దిగింది.
ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో దిగతుండడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. ప్రియాంక పార్లమెంట్లో ఉండాలని స్పష్టం చేశారు.