Home » Lok Sabha Election 2024
లోక్సభ ఎన్నికలకు బీజేపీ మోదీ గ్యారెంటీతో వెళ్లిందని, కానీ ఫలితాల తీరుతో ఆ గ్యారెంటీకి వారంటీ ఖతమైందని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో బీజేపీ ఓటమికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో మోదీ సర్కారు యువత, రైతులను వెన్నుపోటు పోడిచిందని విమర్శించారు.
మోదీ 3.0 సర్కారు కొలువు తీరే వేళయింది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం దేశ రాజధాని అసాధారణ రీతిలో అప్రమత్తమైంది. ప్రమాణ స్వీకార వేదిక అయిన రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని ..
ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మహారాష్ట్రలో దారుణ ఫలితాలు రావడానికి బాధ్యత వహిస్తూ.. తాను రాజీనామా చేస్తానని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.
Lok Sabha Congress Floor Leader: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఆ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్గా(Lok Sabha Floor Leader) బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో(CWC Meeting) ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుపొందడం, ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు..
బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం ఓటమికి వ్యక్తిగతంగా తనదే బాధ్యత అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) తెలిపారు. నగరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బెంగళూరు గ్రామీణ నుంచి తన తమ్ముడు డీకే సురేశ్(DK Suresh) ఓటమికి తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నా అన్నారు.
2019 లోక్ సభ ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ల(Transgenders) ఓటింగ్ శాతం పెరిగిందని ఎన్నికల సంఘం డేటా తెలియజేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వీరి ఓట్లలో 14.58 శాతం మాత్రమే పోల్ కాగా 2024 ఎన్నికల్లో ఇది 25 శాతంగా ఉంది.
నెహ్రూ మాదిరిగా తాను కూడా మూడోసారి వరుసగా ప్రధాన మంత్రి పీఠంలో కూర్చుంటున్నానన్న మోదీ వాదనను కాంగ్రెస్ ఖండించింది. నెహ్రూకు మోదీతో పోలిక ఏంటని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు.
దేశంలో మూడోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. గురువారమే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, సంఘ్ పెద్దలు భేటీ అయ్యారు. బీజేపీ నాయకులకు, మిత్రపక్షాలకు కేటాయింపులపై చర్చించారు. సొంతంగా మ్యాజిక్ మార్కు దాటని బీజేపీకి దక్షిణాదిలో అత్యధిక స్థానాలు వచ్చిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సమానంగా బీజేపీ 8 స్థానాలు సాధించింది.