Home » Landslides
హిమాచల్ ప్రదేశ్లో ఘోరం జరిగింది. కొండ చరియలు ఒక ప్రయివేటు బస్సు మీద విరిగిపడి 15 మంది మరణించారు. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలు..
పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వాహనాలు చేరుకునేందుకు అంతరాయం కలుగుతుండటంతో హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్టు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన టూరిస్టులకు సాయపడేందుకు డార్జిలింగ్ పోలీసులు హెల్ప్లైన్ నెంబర్లు జారీ చేశారు.
ధార్వాడ్ థత్ ప్రాంతంలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యయి. రోడ్డులోని కొంత భాగం దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది.
సిక్కింలో గత వారం రోజులుగా ఎడతెగని వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తీస్తా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. నార్త్ సిక్కింలోని తీంగ్, చుంగ్తాంగ్లో కొండ చరియలు విరిగిపడటంతో పలు రోడ్లు మూసివేశారు.
వాతావరణ ప్రతికూలత, భారీ వర్షాల కారణంగా రాంబాన్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, టెక్నికల్ విద్యా సంస్థలు సోమవారం కూడా మూసే ఉంటాయని, ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగానే ఉండాలని రాంబాన్ డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
చీనాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని వరదలు ముంచెత్తినట్టు అధికారులు తెలిపారు. పలు వాహనాలు కొట్టుకుపోగా, ఇళ్లలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలించేదుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొండచరియల కింద ఉన్న మృతదేహాల కోసం పోలీసులు తవ్వకాలు చేపట్టారు.
ఫెంగల్ తుపాను తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. తుపాను తీరం దాటినప్పటి నుంచీ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల కారణంగా రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది.
ఇండోనేసియాలోని వెస్ట్ సుమత్రా ప్రావిన్స్లో బంగారు గని శుక్రవారం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మంది సజీవ సమాధి అయ్యారు. తప్పిపోయిన మరో ఏడుగురి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.
ప్రకృతి సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించనున్నారు. అందులో భాగంగా చూరల్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన సందర్శించనున్నారని సమాచారం.