• Home » Lalu prasad yadav

Lalu prasad yadav

Lok Sabha Polls: ఎన్డీయేకు ఓటు వేయాలంటున్న ఇండియా కూటమి.. పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

Lok Sabha Polls: ఎన్డీయేకు ఓటు వేయాలంటున్న ఇండియా కూటమి.. పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడు విడతల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈనెల 26వ తేదీన జరగనుంది. బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్‌లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఒక పూర్నియా స్థానంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పప్పు యాదవ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.

Lok Sabha Polls 2024: రాజ్యాంగాన్ని టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు.. లాలూ వార్నింగ్

Lok Sabha Polls 2024: రాజ్యాంగాన్ని టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు.. లాలూ వార్నింగ్

లోక్‌సభ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో తమ పార్టీ అధికారంలోకి వస్తే ''నూతన రాజ్యాంగ'' రూపకల్పన చేస్తామంటూ బీజేపీ నేతలు పదేపదే వల్లిస్తున్నారని, వారిని మోదీ అదుపు చేయలేకపోతున్నారని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరచేందుకు ఎవరు ప్రయత్నించినా ప్రజలు వాళ్ల కళ్లను పెరికివేస్తారని ఆయన హెచ్చరించారు.

Loksabha Polls: కుటుంబం కోసమే లాలు తపన.. బీజేపీ తీవ్ర విమర్శలు

Loksabha Polls: కుటుంబం కోసమే లాలు తపన.. బీజేపీ తీవ్ర విమర్శలు

రాష్ట్రీయ్ జనతాదల్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయనకు కుటుంబ సభ్యులే ముఖ్యం అని మండిపడింది. లోక్ సభ ఎన్నికల తొలి జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. అందులో లాలు ఇద్దరు కూతుళ్లకు టికెట్ దక్కింది. దాంతో లాలు ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు చేసింది.

LS Polls: కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు రేపుతున్న పూర్నియా సీటు..

LS Polls: కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు రేపుతున్న పూర్నియా సీటు..

లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులతో కాంగ్రెస్‌లో టికెట్లు దక్కని నేతలతొ ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొంమతంది నేతలు టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతుంటే.. మరికొందరు నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Lok Sabha Elections: బీహార్‌లో కాంగ్రెస్‌ను వెంటాడుతున్న కష్టాలు.. పొత్తులతో లాభమా.. నష్టమా..!

Lok Sabha Elections: బీహార్‌లో కాంగ్రెస్‌ను వెంటాడుతున్న కష్టాలు.. పొత్తులతో లాభమా.. నష్టమా..!

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి అధికారం లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా.. ఎన్టీయే (NDA) కూటమి వ్యతిరేక పార్టీలను ఏకం చేసి ఇండియా పేరుతో కూటమి కట్టాయి. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూపీఏ కూటమి స్థానంలో వివిధ పార్టీల కలయికతో ఇండియా కూటమి ఏర్పడింది.

Lok Sabha Polls: బీహార్‌లో కాంగ్రెస్‌కు 9 సీట్లు ఇస్తామంటోన్న లాలు.. కండీషన్స్ అప్లై

Lok Sabha Polls: బీహార్‌లో కాంగ్రెస్‌కు 9 సీట్లు ఇస్తామంటోన్న లాలు.. కండీషన్స్ అప్లై

బీహార్‌లో కూటమి సీట్ల లెక్క తేలడం లేదు. భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం కొలిక్కి రాకముందే రాష్ట్రీయ జనతా దళ్ తన అభ్యర్థులను ప్రకటించింది. కొందరికి టికెట్లను కూడా అందజేసింది. దీంతో అక్కడ కూటమి పోటీ చేసే స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతలో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి మరో ఆఫర్ ఇచ్చారు.

Loksabha Elections: రాజకీయాల్లోకి లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే..?

Loksabha Elections: రాజకీయాల్లోకి లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే..?

లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు రోహిణి ఆచార్య లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. లాలు కుటుంబానికి కంచుకోట అయిన సరన్ లోక్ సభ నుంచి ఆర్జేడీ తరఫున పోటీ చేస్తారని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ప్రస్తుతం లాలు కుటుంబం నుంచి ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, పెద్ద కూతురు మిసా భారతి రాజకీయాల్లో ఉన్నారు.

ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు

ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. పాట్నాలో గల రాజేంద్ర నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చికిత్స అందిస్తున్నారు.

Smriti Irani: దాణా దొంగ లాలు ప్రసాద్ యాదవ్.. మోదీపై వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ

Smriti Irani: దాణా దొంగ లాలు ప్రసాద్ యాదవ్.. మోదీపై వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ

ప్రధాని మోదీకి కుటుంబం లేదని, పిల్లలు లేరని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వరసగా లాలు ప్రసాద్ యాదవ్‌కు కౌంటర్ ఇస్తున్నారు. లాలు ప్రసాద్ యాదవ్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దాణా దొంగ అయిన లాలు ప్రసాద్ యాదవ్‌కు మోదీని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.

PM Modi: లాలుకు బీజేపీ కౌంటర్.. మేం మోదీ కుటుంబం అంటున్న నేతలు

PM Modi: లాలుకు బీజేపీ కౌంటర్.. మేం మోదీ కుటుంబం అంటున్న నేతలు

ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి కుటుంబం లేదు, పిల్లలు లేరని విరుచుకుపడ్డారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి