Home » Kuppam
Bhuvaneswari: కుప్పంలో గృహప్రవేశ కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజామున గృహప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలో కుప్పంలో ప్రతి ఇంటా సందడి నెలకొంది. సొంత కుటుంబ సభ్యుడే గృహప్రవేశం చేస్తున్నట్లు కుప్పం వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు.
మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజల అభిమానంతో కూడిన సీఎం చంద్రబాబు, శివపురం గ్రామంలో కొత్త ఇంటి గృహప్రవేశం జరుపుకోబోతున్నారు. భువనేశ్వరి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి కొత్త ఇల్లు వద్ద గడుపుతున్నారు.
కుప్పంలో మంగళవారం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ శిరస్సు ఊరేగింపు ఘట్టం నభూతో.. న భవిష్యతి అన్నట్టుగా సాగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు సర్వం సిద్ధమైంది. కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం జరగనుంది.
చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నీటిలో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. కుప్పంలో ముగ్గురు, బుట్టాయగూడెంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ జల సమాధి చెందారు.
కుప్పానికి ‘వాహన’యోగం పట్టింది. రెండు అంబులెన్స్లు, నాలుగు ఈ-ఆటోలు ఇప్పటికిప్పుడు రావడమే కాదు, ఇంకో 90 దాకా ఈ-ఆటోలకు ఒప్పందం కుదిరింది. ఒప్పందమంటే ఇదేదో నగదు చెల్లించే పరస్పర ఒప్పందం కాదు, ఉచితంగా అన్ని ఆటోలూ కుప్పం చేరబోతున్నాయి.
కుప్పంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. క్షేత్ర స్థాయి సిబ్బందే కాదు, మండల స్థాయి అధికారుల పోస్టులు కూడా ఖాళీగానే ఉండి, ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. మరోవైపు సాధారణంగా జరిగే ఉపాధి పనులతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన సిమెంటు రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణం కూడా ఉపాధి హామీకి అనుసంధానించడంతో పని ఒత్తిడి ఎక్కువై సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ కార్యాలయానికి మంజూరు చేసిన 44 పోస్టులు భర్తీ కాకపోవడంతో పని వత్తిడి ఏమాత్రం తగ్గడంలేదు.