Home » Kolkata
ఇక ఈ వీడియోలో తాను స్పందించిన తీరుపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రచనా బెనర్జీ స్పందించారు. ఇది ఖచ్చితంగా నా వైపు నుంచి జరిగిన చాలా పెద్ద తప్పుగా ఆమె అభివర్ణించారు. తాను ఇలా చేసి ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. అందరూ చేస్తున్నట్లే తాను సైతం మరో పేరుతో ఆమెను పిలవాల్సి ఉందన్నారు. కానీ ఆ సమయంలో తాను చాలా వేదనను అనుభవించానని చెప్పారు.
సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే అభియోగంపై ప్రశ్నించేందుకు బీజేపీ నేత లాకెట్ ఛటర్జీకి కోల్కతా పోలీసులు ఆదివారంనాడు సమన్లు పంపారు.
ఈస్ట్ బెంగాల్ వెర్సస్ మోహన్ బాగాన్ డెర్బీ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫుట్బాల్ మ్యాచ్ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. మ్యాచ్కు తగిన భద్రత కల్పించలేమని కోల్కతా పోలీసులు అసక్తత వ్యక్తం చేయడంపై బీజేపీ మండిపడింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ నిరసనలు కొనసాగుతుండటంతో కోల్కతా పోలీసులు శాంతిభద్రతల దిశగా చర్యలకు దిగారు. మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చుట్టుపక్కల 7 రోజుల పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 చట్టం కింద సెక్షన్ 163 (గతంలో సీఆర్పీసీ సెక్షన్ 144)ని విధించారు.
కోల్కతా(kolkata)లోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో 31 ఏళ్ల మహిళా వైద్యురాలిపై హత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ప్రశ్నించేవారికి ఇచ్చిన వాంగ్మూలాలలో అసమానత కారణంగా అతనికి లేయర్డ్ వాయిస్ విశ్లేషణ (LCA) పరీక్ష నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది.
కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు శనివారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. సంబంధిత నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలపవచ్చునని వెల్లడించింది.
కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు శనివారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య చర్యకు దిగింది. సుమారు 43 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
కోల్కతా ట్రైనీ డాక్టర్ పాశవిక అత్యాచారం, హత్య కేసుపై 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు బాధితురాలు 'నిర్భయ' తల్లి ఆశా దేవి ఘాటుగా స్పందించారు. కేసును సమర్ధవంతంగా పరిష్కరించడం, చర్యలు తీసుకోవడంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని, ఆమె తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.