Home » Khammam
పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతున్న కూతురికి అప్పగింతలు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై గుండెపోటుతో ఆమె తల్లి మృతిచెందింది.
బైక్ కొనివ్వలేదని ఓ కుమారుడు నిద్రలో ఉన్న తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. ఖమ్మం జిల్లా మంగళగూడెంలో ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
న్యూజిలాండ్ దేశానికి చెందిన ఎంటోలోమా హోచెస్టెటెరీ జాతికి చెందిన నీలి ఆకాశ పుట్టగొడుగు (స్కైబ్లూ మష్రూమ్) మన కనకగిరి అడవుల్లో మొలకెత్తింది. ఈ విషయాన్ని ఎఫ్డీవో వాడపల్లి మంజుల ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్లోని పెనుబల్లి, కల్లూరు మండలాల్లో విస్తరించి ఉన్న కనకగిరి హిల్స్లోని పులిగుండాల వద్ద ఈ అరుదైన మష్రూమ్ మొలకెత్తిందన్నారు.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం 404.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడం నుంచి గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి జలాశయానికి 1,700 క్యూసెక్కుల చొప్పున నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు.
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం మరో అరుదైన ఘనతను సాధించింది. దక్షిణ అయో ధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దేవస్థానానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్టైజేషన్ (ఐఎస్వో) గుర్తింపు లభించడం విశేషం.
'మీరు చనిపోయినా మీ కళ్లు అందమైన అమ్మాయిల్ని చూడాలని కోరుకుంటున్నారా! అయితే నేత్రదానం చేద్దాం..' అనేది ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ప్రకటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిన ఈ ప్రకటన యువతలో నేత్రదానంపై అవగాహన తీసుకొచ్చింది ఈ ప్రకటన. యువతను ఆలోచింప చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
బతికుండగానే డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన ఘటన కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. చేసిన తప్పును సదరు సెక్షన్ అధికారి సరిదిద్దుకోకపోగా తమనే దబాయించి మందలించాడని బాధితులువాపోయారు.
వేర్వేరు ఘటనల్లో కిచిడీ తిన్న 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన ఆశ్రమ వసతి గృహం, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
యూరియా కోసం రైతులు ఉదయం 5 గంటలకే పంపిణీ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండంలోని కల్లూరు, చెన్నూరు
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత కమ్మ కులంపై విమర్శలు చేసినట్టుగా ప్రచారం అవుతున్న దుర్మార్గపు మాటలు బాధాకరమని ఖమ్మం కమ్మ మహాజన సంఘం పేర్కొంది.