Home » Khammam
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కారును గెల్చుకున్న రైతు గుడిపూడి శ్రీనివాసరావుకు బుధవారం ఖమ్మం యూనిట్ కార్యాలయంలో చెక్కు అందజేశారు.
ఏం జరిగిందో తెలియదు.. ఎలా జరిగిందో తెలియదు. కానీ.. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మాత్రం తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన హైదరాబాద్ నగరంలోని సాయినగర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
MP Raghunandan Rao: పాకిస్తాన్కి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.
KTR Supports Indian Army: పాకిస్థాన్తో భారతదేశం పోరాడుతోందని.. ఇండియన్ ఆర్మీకి అండగా నిలుద్దామని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం మిట్టపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుత వేసవి సెలవుల రద్దీ నేపధ్యంలో ఈనెల 12వతేదీ నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలో కొన్ని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా, మరికొన్ని ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.
ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు.
ఖమ్మం జిల్లాలో రైతు గరికపాటి వెంకట్రావు విదేశాల నుంచి తెచ్చిన మియాజాకీ మామిడి మొక్కలు ఇప్పుడు కిలోకు రూ.2.50 లక్షల ధరను చేరుకున్నాయి. ఈ ప్రత్యేక రకం మామిడి కోసం రైతు కుక్కలతో పంటను కాపలాగా పెట్టి రక్షిస్తున్నాడు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు ఇకపై ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవరంలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణలో భారీ గాలివానతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరోవైపు తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు ఒకరు మృతి చెందగా, ఎన్హెచ్ఆర్సీ వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
వంట గ్యాస్ సిలిండర్ లీకవడంతో ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.