Home » Khammam
ఫెంగల్ తుఫాను ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శనివారం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి.
అమెరికాలోని ఓ షాపింగ్ మాల్లో దుండగులు జరిగిన కాల్పుల్లో ఖమ్మం యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువు కోసం ఐదు నెలల క్రితమే విదేశానికి వెళ్లిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రభుత్వ పఠశాలల్లో చదువుకునే విద్యార్థులూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా.. ‘స్పోకెన్ ఇంగ్లీష్’ తరగతులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారులు నిర్ణయించారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతులు మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు వారిద్దరి కంట్లో కారం కొట్టి చంపారు. యర్రా వెంకటరమణ (62), కృష్ణకుమారి (60) దంపతులకు కొత్త బస్టాండ్ సమీపంలోని సొంత ఇంట్లో ఉంటున్నారు.
సీపీఐ ఖమ్మం జిల్లా సమితి కార్యదర్శి పోటు ప్రసాద్ (64) బుధవారం హఠాన్మరణం చెందారు. తెల్లవారుజామున నగరంలోని లకారం ట్యాంక్బండ్పై వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
సీనియర్ రాజకీయవేత్త, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(73) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలోని పత్తి మార్కెట్కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని హరీష్రావు అన్నారు.
ఆహార తనిఖీ విభాగం రాష్ట్ర అధికారులు సోమవారం ఖమ్మంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా పలు ఆహార తయారీ కేంద్రాలు, స్వీట్స్ దుకాణాలు, పిండి వంటల కేంద్రాల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు.
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్ చేసి గుండు కొట్టించిన ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.