Home » Karnataka BJP
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు(Rameswaram Cafe Blast) తర్వాత కర్ణాటక బీజేపీ చీఫ్ బీ విజయేంద్ర సిద్ధరామయ్య ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు, నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇలాంటి నేరాల విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ (BJP) నుంచి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జేఎంఎం, కాంగ్రెస్ మైత్రితో ఏర్పడిన జార్ఖండ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంపైసోరెన్ మంత్రివర్గ విస్తరణకు ముందే వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీపై కేంద్ర మాజీమంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఇద్దరు గోవుల శాపానికి గురయ్యారని ఆరోపించారు.
కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ తాజాగా రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ రుణాల్ని ప్రభుత్వాలు మాఫీ చేస్తారన్న ఉద్దేశంతో.. ప్రతి ఏటా వాళ్లు కరువుని కోరుకుంటున్నారని కుండబద్దలు కొట్టారు. ఓ కార్యక్రమంలో శివానంద పాటిల్ మాట్లాడుతూ..
Karnataka BJP: తాము అధికారంలోకి వస్తే.. దళితుల అభ్యున్నతి కోసం రకరకాల పథకాలు తీసుకొస్తామని, వారికి ఉన్నత పదవులు ఇస్తామంటూ రాజకీయ పార్టీలు చేసే హామీలు అన్నీ ఇన్నీ కావు. ‘ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మీ తలరాతలే మార్చేస్తాం’ అంటూ ప్రతిజ్ఞలు చేస్తారు.
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్(Operation Lotus)కు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ఆరోపించారు. ఆయన బెంగళూరు(Bengaluru)లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ కుట్రలకు తెర తీసిందని.. అందులో భాగంగా ఎమ్మెల్యేలను లాగేందుకు ఆపరేషన్ కమల్ని అమలు చేయాలని చూసిందని సిద్దరామయ్య అన్నారు.
కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే(Congress MLA) చేసిన వ్యాఖ్యలు కన్నడ కాంగ్రెస్ లో తీవ్ర దుమారాన్ని రేపాయి. వివరాలు.. మాండ్యకు చెందిన ఎమ్మెల్యే రవికుమార్ గౌడ మాట్లాడుతూ.. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవికాలం పూర్తి చేసుకున్నాక.. తదుపరి రెండున్నరేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పని చేస్తారని అన్నారు.
లులు మాల్(Lulu Mall) లో పాకిస్థాన్ జెండా(Pakistan Flag) విషయంలో తలెత్తిన వివాదంలో బీజేపీ నేతపై కేసు నమోదయింది. ఈ వివాదంలో జాబ్ కోల్పోయిన మేనేజర్ తిరిగి విధుల్లో చేరనున్నారు.
భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) కాదని కర్ణాటక(Karnataka)కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ(BJP) ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్(Basanagouda Patil) గురువారం ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subash Chandra Bose) భారత దేశ తొలి ప్రధాని అని కామెంట్లు చేశారు.