Home » Kakinada
కలెక్టరేట్ (కాకినాడ), జనవరి 7 (ఆంధ్ర జ్యోతి): ఉపాధ్యాయులే సమాజంలో మార్పు తీసుకురాగలరనీ, ఉన్నతమైన సమాజ నిర్మాణం వారి ద్వారానే జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పేర్కొన్నారు. కాకినాడ పీ ఆర్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభల్లో భాగంగా మూడో రోజు ప్రతినిధుల సభ జరిగింది. సభకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించా రు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడు తూ
ప్రస్తుతం దేశంలో విద్యావిధానం బలహీనపడుతోందని.. కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణతో ప్రమాదంలో పడిందని కేరళ మాజీ విద్యాశాఖ మంత్రి ఎంఏ బేబి అన్నారు.
కాకినాడ సీ పోర్ట్స్, సెజ్ల్లోని తన వాటాను వైసీపీ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ ప్రముఖ వ్యాపారవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.
కలెక్టరేట్ (కాకినాడ), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో జాతీయ విద్యా విధానం 2020 విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తుందని యూటీఎఫ్ స్వర్ణో త్సవ మహాసభల్లో మేధావులు, విద్యావేత్తలు వ్యతిరేకించారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహా సభల్లో రెండోరోజు సో
Andhrapradesh: ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు స్టెల్లా నౌక బయలుదేరి వెళ్లిపోయింది. దాదాపు 55 రోజులుగా కాకినాడ పోర్టులో 'స్టెల్లా ఎల్' నౌక నిలిచిపోయిన విషయం తెలిసిందే. నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశంలో కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ అనుమతిచ్చారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమైనదని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఐవీ రావు కొనియాడారు.
కలెక్టరేట్ (కాకినాడ), జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో విద్యావ్యవస్థ ధ్వంసమైందని ధ్వజ మెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠ శాలలు ధ్వంసమయ్యాయని, అయినప్పటికీ వాటిని కాపాడు కోవడానికి ఎన్నో ఉద్యమాలు చేశామని యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలో వక్తలు పేర్కొన్నారు. కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం యూటీఎఫ్ 17వ స్వర్ణోత్సవ విద్యా వైజ్ఞానిక మహాసభలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. సభకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంక టేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకు
జీజీహెచ్ (కాకినాడ), జనవరి 4(ఆంధ్రజ్యోతి): కాకినాడ జీజీహెచ్ ఆంకాలజీ విభాగంలో రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డా. పేర్రాజు దినవాహి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరా
పెద్దాపురం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్భం దీగా అమలుచేయడంతో పాటు వేతనదారుల కనీస వేతనాన్ని రూ.263 నుంచి రూ.300కి పెంచి ఇవ్వటానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఈ విభాగం బోగస్ మస్తర్లకు అడ్డుకట్టవేయడ ంతో పాటు పనివేళల్లో మార్పులుచేసి వేతనదారులకు గిటు ్టబాటు వేతనం అందించేం
నడి సంద్రంలో స్విమ్మర్ గోలి శ్యామల సాహసం చేశారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 150 కిలో మీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు. మహిళల ఆరోగ్యం, పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంతో కాకినాడ జిల్లా సామర్ల కోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల డిసెంబర్ 28 వ తేదీన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి ఈత ప్రారంభించారు.