Home » KA Paul
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కేఏ.పాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. రేవంత్ గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితి మారుతోందన్నారు.
KA Paul: ఏపీ సీఎం జగన్ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు కేఏ పాల్కు తెలిపారు. అంతేకాకుండా క్యాంప్ కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. అనంతరం జగన్పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ వచ్చారు. సీఎం వైఎస్ జగన్ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు ఆయనను క్యాంపు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద కేఏ పాల్ వేచి చూస్తున్నారు.
Andhrapradesh: కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం పెద్ద తప్పిదమన్నారు. ఆస్తులు, పదవి కోసం సోనియాకు షర్మిల తన పార్టీ ని అమ్మేశారని విమర్శించారు. షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా? అంటూ మండిపడ్డారు. రాజారెడ్డి, వైయస్ ఆత్మలతో తాను మాట్లాడుతానన్నారు.
Viral Video: వంగవీటి మోహన్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు కావడంతో సోమవారం నాడు విజయవాడలో కేఏ పాల్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలో కేఏ పాల్ ప్రసంగిస్తుంటే..
జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని.. ఆయన మా పార్టీలోకి వస్తే.. ఏపీకి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు తన కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలంగాణ నుంచి జన సేనను తరిమేశారు. పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు రావాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో అవినీతి పాలన , ప్రత్యేక ప్యాకేజీ, హోదా సాధించలేక పోయారు’’ అని కేఏ పాల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం-2023 నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) వెంటనే వెనక్కి తీసుకోవాలని చట్టాన్ని రద్దు చేయకపోతే న్యాయపోరాటం చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రుల హక్కుల కోసం న్యాయవాదులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విఫలం అయ్యారని కేఏ పాల్ ఎద్దేవా చేశారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని చిత్తుగా ఓడించి, తెలుగు వారి సత్తా చూపిస్తానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ..
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ( KCR ) ని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సోమవారం నాడు పరామర్శించారు.
వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీలో ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి కేఏ పాల్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి స్టార్కు 1000 కోట్లు ఇచ్చారని కాపులను టీడీపీకి అమ్మేశారన్నారు. 2009 లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారని కేఏ పాల్ పేర్కొన్నారు.