Home » Jupally Krishna Rao
హత్యారాజకీయాలకు పాల్పడుతోంది బీఆర్ఎస్సేనని.. వివాదాల కారణంగా జరిగిన హత్యలను రాజకీయాలకు ముడిపెడుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్రెడ్డి హత్య కేసులో తన హస్తం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్రెడ్డి (52) అనే బీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి తన సొంత పొలంలోని కల్లం దొడ్డి వద్ద నిద్రిస్తున్న శ్రీధర్రెడ్డిని దుండుగులు గొడ్డలితో నరికిచంపారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) పోద్బలంతో నియెజకవర్గంలో రెండు హత్యలు జరిగాయని.. వెంటనే ఆయనను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అనుబంధ పేపర్లో కావాలని తమ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మండిపడ్డారు. రాష్ట్రంలోని 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ.. అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.
ఎక్సైజ్ శాఖలో(Excise Department) బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సీరియస్ అయ్యారు. బదిలీల సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ను..
Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు మొరపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తన ఫోన్తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురైనట్లు వెల్లడించారు. ‘‘గతంలో నా ఫోన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నా ఫోన్ నుండి పొంగులేటికి ఫోన్ వెళ్లినట్లు, మాట్లాడినట్లు జరిగింది. దీనిపై గతంలో మేము ఫిర్యాదు చేశాము’’ అని తెలిపారు.
రేషన్ కార్డులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతాయని.. ప్రజలు కంగారు పడవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో రూ. 74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్ రూం ప్లాట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ప్రారంభించారు.
మతాల పేరుతో బీజేపీ దేశాన్ని ముక్కలు చేసి చిచ్చు పెడుతున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) ఆరోపించారు. నేడు ఆదిలాబాద్లో జరిగిన బీజేపీ(BJP) సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) కాంగ్రెస్పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.