Home » Jubilee Hills
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండడంతో సోమవారం సాయంత్రమే ఈవీఎం, వీవీప్యాట్లను సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో వివిధ పోలింగు స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు.
నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఓటింగ్ జరుగుతుండటంతో ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులని నిబంధనల మేరకు బంద్ చేయాలని ఆదేశించారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల బేరసారాలన్నీ పక్క నియోజకవర్గాల్లోకి మారాయి. ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్ను ప్రారంభించాయి. కీలకంగా ఉన్న వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే బేరసారాలకు దిగితే ప్రత్యర్థులకు తెలుస్తుందని, అడ్డాలను పక్క నియోజకవర్గాలకు మార్చారు.
మాగంటి గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిపాస్తుల కోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లిద్దరూ పంచుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్.
సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరిగా రేవంత్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సిటీలో మళ్లీ తాగునీటి కష్టాలు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్నేనని విమర్శించారు. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని నొక్కిచెప్పారు కేటీఆర్.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే చాలా మంది జూబ్లీహిల్స్ అంటే సంపన్నులు, బడాబాబులు ఉండే నియోజకవర్గం అని అనుకుంటారు. కానీ ..
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు, ఫొటో ఉన్న ఓటరు గుర్తింపుకార్డు ప్రతులను నాయకులు పంపిణీ చేశారు.