• Home » Jr NTR

Jr NTR

Devara movie: ‘దేవర’ చిత్రం విడుదలలో అపశృతి

Devara movie: ‘దేవర’ చిత్రం విడుదలలో అపశృతి

Andhrapradesh: ఓ అభిమాని కూడా ఎన్టీఆర్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాడు. ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశాడు. కానీ అంతలోనే జరిగిన ఘటనతో థియోటర్ల ప్రేక్షకులు అవాక్కయ్యారు. సినిమా చూస్తూ సదరు వ్యక్తి ఒక్కసారి కూప్పకూలిపోయాడు.

Jr NTR-Devara: జూనియర్ ఎన్టీఆర్‌ను తాకిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం

Jr NTR-Devara: జూనియర్ ఎన్టీఆర్‌ను తాకిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం

జూనియర్ ఎన్టీఆర్‌ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం తాకింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘దేవర’ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. దేవర సినిమా పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ నినాదాలను జన జాగరణ సమితి నేతలు అతికించారు.

Devara-KTR: ప్రెస్‌మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించిన కేటీఆర్.. ఎందుకంటే?

Devara-KTR: ప్రెస్‌మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించిన కేటీఆర్.. ఎందుకంటే?

రెండు రోజుల క్రితం నిర్వహించతలపెట్టిన ‘దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్’ అనూహ్యంగా రద్దయింది. ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు మించి హైదరాబాద్ నగరంలోని నోవాటెల్ హోటల్‌కు తరలి రావడంతో గందరగోళం ఏర్పడింది. భద్రతా కారణాల రీత్యా ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ (బుధవారం) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telangana: వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు

Telangana: వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు..

Jr NTR: ఎన్టీఆర్‌ చేతికి స్వల్ప గాయం!

Jr NTR: ఎన్టీఆర్‌ చేతికి స్వల్ప గాయం!

జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికి స్వల్ప గాయమైంది. అయితే ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా షూటింగ్‌లో తీవ్ర గాయాలపాలయ్యారని.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని బుధవారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది.

High Court: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంటి స్థలంపై వివాదం హైకోర్టులో పిటిషన్‌

High Court: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంటి స్థలంపై వివాదం హైకోర్టులో పిటిషన్‌

తన ఇంటి స్థలంపై వివాదం తలెత్తడంతో సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలం విషయమై సమస్య తలెత్తింది. తాను ఆ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో కొనుగోలు చేశానని, చట్టప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టానని జూనియర్‌ ఎన్టీఆర్‌ చెబుతున్నారు. కానీ ఆ భూమిని ఎన్టీఆర్‌కు అమ్మిన వ్యక్తులు దానిని 1996లోనే తమ వద్ద తనాఖా పెట్టి రుణాలు పొందారంటూ ఎస్‌బీఐ, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండ్‌సఇండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్‌ కింద డెట్‌ రకవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ)ను ఆశ్రయించాయి.

Kolikapudi Srinivas: అభిమాని అంటూ ఎన్టీఆర్‌నే మోసం చేసిన ఘనుడు కొడాలి నాని:..

Kolikapudi Srinivas: అభిమాని అంటూ ఎన్టీఆర్‌నే మోసం చేసిన ఘనుడు కొడాలి నాని:..

Andhrapradesh: మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని... ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి నాని మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 NTR: తెలుగువారి ధైర్యం ఎన్టీఆర్.. నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్

NTR: తెలుగువారి ధైర్యం ఎన్టీఆర్.. నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కుమారుడు బాలకృష్ణ, మనమళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మనమరాలు అలేఖ్య రెడ్డి అంజలి ఘటించారు.

Chandra Mohan: చంద్రమోహన్‌ మృతిపట్ల ఎన్టీఆర్, బాలయ్య సంతాపం

Chandra Mohan: చంద్రమోహన్‌ మృతిపట్ల ఎన్టీఆర్, బాలయ్య సంతాపం

ప్రముఖ నటుడు చంద్రమోహన్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, మంచు విష్ణు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేత రామకృష్ణ సంతాపం ప్రకటించారు.

Ashwinidutt: చంద్రబాబు కోసం మేము వచ్చాం.. రాని వారి గురించి వదిలేయండి

Ashwinidutt: చంద్రబాబు కోసం మేము వచ్చాం.. రాని వారి గురించి వదిలేయండి

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్(Ashwinidutt) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి