Home » JP Nadda
బీజేపీలో సంస్థాగత మార్పులు త్వరలో ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా కొనసాగించారన్నారు. ఇప్పుడు ఆ పదవీకాలం పూర్తయిందన్నారు. అధ్యక్ష మార్పు అనివార్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తనకు మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించారని కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు నేపథ్యంలో బీజేపీలో సంస్థాగతంగా మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను క్యాబినెట్లోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో ఎవరికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్నది ఆసక్తిదాయకంగా మారింది.
దేశంలో మూడోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ను తప్పించి ఆ స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఈసమావేశంలో ఆర్ఎస్ఎస్ కీలక నాయకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందున బీజేపీ సీనియర్ నేతలు సోమవారం భేటీ అయ్యారు. పార్టీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల కౌంటింగ్, వెలువడే ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కౌంటింగ్ వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరుపుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సోమవారంనాడు సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.
లోక్సభ చివరి విడత ఎన్నికల పోలింగ్ ఘట్టం శనివారం సాయంత్రంతో ముగుస్తుండగా, ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎలాంటి ఆందోళన చెందడం లేదని, దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే ఉన్నారని చెప్పారు.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో పసిగట్టలేనంతగా వైరల్ అవుతున్నాయి. చివరికి.. ఈ ఫేక్ వార్తల ఛట్రంలో..
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముందుడి బీజేపీని నడిపిస్తోందనే అభిప్రాయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.