Home » JP Nadda
జేపీ నడ్డా స్థానంలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్ష ఎన్నికకు కసరత్తు మొదలైంది. డిసెంబరు నెలాఖరులోపు కొత్త సారథి ఎన్నిక పూర్తికానుంది. ఆయన పదవీకాలం ఎప్పుడో పూర్తయింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను ఈ ఏడాది చివర వరకు కొనసాగించే అవకాశాలున్నాయి. దీంతో కొత్త సంవత్సరంలో కొత్త అధ్యక్షుడిని బీజేపీ అగ్రనాయకత్వం నియమించనుందని తెలుస్తుంది. అసలు అయితే జేపీ నడ్డా పార్టీ అధ్యక్ష పదవి గతంలోనే పూర్తయింది.
పొగాకు(Tobacco) అధికంగా పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంటలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశపు పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeswari) తెలిపారు. ఈ సందర్భంగా పరిమితి మించి పండించిన పొగాకుపై పెనాల్టీ లేకుండా చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda)ను కోరినట్లు ఆమె వెల్లడించారు.
తమిళనాడులోని కళ్లకురిచ్చి కల్తీ సారా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించక పోవడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విస్మయం వ్యక్తం చేశారు.
రాజ్యసభ సభ పక్ష నేతగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను(JP Nadda) ఆ పార్టీ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన పీయూష్ గోయల్(Piyush Goyal) స్థానంలో ఆయన్ని నియమించింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో ఆ పార్టీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష పదవి ఈ నెలతో ముగియనుంది. అయితే మరికొద్ది మాసాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఉత్తర భారత దేశాన్ని తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda) పరిస్థితిపై సమీక్షించారు. హీట్ వేవ్ పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఆసుపత్రులు సిద్ధంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో వేడిగాలులు బలంగా వీస్తున్నాయి. ఆ క్రమంలో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతాధికారులకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రబాబు.. తన నివాసంలో విందు ఇస్తున్నారు.
మంగళవారం నాడు పలువురు కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు తరువాత సోమవారం సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ.