Home » JNTU
జేఎన్టీయూ(JNTU)కు, వర్సిటీకి అనుబంధంగా ఉన్న 8 కళాశాలలకు ప్రతినెలా రెండవ శనివారంతో పాటు 4వ శనివారాన్ని కూడా సెలవుదినంగా ప్రకటించాలని కొత్త వీసీని సిబ్బంది కోరారు.
జేఎన్టీయూ నూతన ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే డా. కిషన్కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో పనిదినాలను వారానికి ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించాలని నిర్ణయించారు.
గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఎట్టకేలకు మెట్టు దిగింది. ప్రభుత్వ నిబంధనలు, వర్సిటీ ఆదేశాలను బేఖాతరు చేసిన కారణంగా గోకరాజు కాలేజీ యాజమాన్యంపై జేఎన్టీయూ అధికారులు కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్సిటీ అఫిలియేటెడ్, అటానమస్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలపై కొరడా ఝళిపించేందుకు జేఎన్టీయూ సన్నద్ధమైంది.
జేఎన్టీయూ(JNTU)లో పలువురు అధికారులు, ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎం.పద్మావతిని బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ సర్వీసెస్(బిక్స్) డిప్యూటీ డైరెక్టర్గా నియమించారు.
జేఎన్టీయూ(JNTU)కు కొత్త వైస్చాన్స్లర్ నియామకం మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. గతేడాది మే 21న ఖాళీ అయిన వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినా సాంకేతిక కారణాల రీత్యా నియామక ప్రక్రియ రెండుసార్లు వాయిదా పడింది.
జేఎన్టీయూ(JNTU) పరీక్షల విభాగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఉన్నతాధికారులు నియమించిన కమిటీ విచారణను ప్రారంభించింది. కమిటీకి చైర్మన్, కన్వీనర్లను నియమించారు.
గత కొన్నేళ్లుగా విజయవంతంగా ఎంసెట్/ఎప్సెట్ పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్టీయూ(JNTU)కే మరోసారి బాధ్యతలు అప్పగించారు.ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) అనగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది జేఎన్టీయూనే.
జేఎన్టీయూ(JNTU) పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియలో అంతులేని జాప్యం అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. గతేడాది జనవరిలో పీహెచ్డీ అడ్మిషన్ల(PhD Admissions) కోసం వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా, ఏడాదవుతున్నా ప్రవేశాల ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఈ నెల 15న (కనుమ పండగ) ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడంలేదని, ఆ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు జేఎన్టీయూ అధికారులు స్పష్టం చేశారు.