Home » JDU
కేంద్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకునేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎన్డీఏ(NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును(PM Modi) రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు మోదీని బలపరిచారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీకి అగ్నిపథ్ అంశం తలనొప్పిగా మారేలా ఉంది. సొంతంగా మెజార్టీ దక్కకపోవడంతో టీడీపీ, బిహార్లోని జేడీయూ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఇలాంటి కీలక తరుణంలో జేడీయూ తన తొలి డిమాండ్ను తెరపైకి తెచ్చింది.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో బిహార్లో అధికారంలో ఉన్న జేడీయూ, ఏపీలో త్వరలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్న టీడీపీ మద్దతు బీజేపీకి(BJP) తప్పనిసరి. మిత్ర పక్షాల మద్దతు కావాలంటే వారు కోరిన పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి దేశ రాజధాని హస్తిన వేదికగా చక్రం తిప్పబోతున్నారా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
సార్వత్రిక సమరం ముగిసింది అనుకుంటున్న వేళ మరో సమరం తెరపైకి వచ్చింది. అదే.. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడం. ప్రధాని మోదీ చరిష్మా మరోసారి మ్యాజిక్ చేస్తుందనుకున్న బీజేపీ నేతలకు ఇది మింగుడుపడటం లేదు.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్(Nitish Kumar) బుధవారం ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారని వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 40 సీట్లలో 12 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకున్న జేడీయూ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.
Prime Minister Of India: దేశ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా..
మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నోరుజారారు.