Home » JC Prabhakar Reddy
JC Prabhakar Reddy vs Madhavi Latha: సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మరి ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పారు? అసలు ఏమైంది..? పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవాల్సిందే..
BJP MLA Parthasarathy : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జేసీకి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి శుక్రవారం విజయవాడలో వార్నింగ్ ఇచ్చారు.
Minister Satyakumar: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలతో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.
‘పేర్ని నాని మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన మొహంలో రక్తపు చుక్కలేదు. ఏం.. అధికారంలో ఉన్నపుడు ఏం మాట్లాడావో మరిచిపోయావా?
పేర్ని నాని లాంటి వాళ్లను వదిలిపెట్టవద్దని జేపీ ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. ‘పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు.. ఇంటి కొచ్చి నిన్ను కొట్టిన అడిగే దిక్కు లేదు.. నీకు సంస్కారం లేదు... ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వీపు విమానం మోత మోగిస్తా’ అని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
Andhrapradesh: ‘‘ ఫ్లై యాష్ అనేది నా పుట్టగోస లాంటిది.. అది కేవలం మా ప్రెస్టేజ్ మాత్రమే. మా గురించి మాట్లాడే వాళ్ళకే కాదు.. మాకు కూడా చీము నెత్తురు ఎక్కువ ఉంది’’ అని జేసీ అన్నారు. అందరికీ మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎవరికి ఎక్కడ తలవంచాల్సిన అవసరం లేదని..
ఆర్టీపీపీ దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జేసీ లారీలకు ఫ్లైయాస్ను లోడ్ చేయకుండా జమ్మలమడుగు నేతలు అడ్డుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో లారీలు, టిప్పర్లను జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఆదిపత్యపోరు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రెండు జిల్లాల నేతలు పట్టువదలడంలేదు. సీఎం చంద్రబాబు పంచాయతీ చేసినా కూడా వారు పట్టించుకోవడంలేదు.
కడప జిల్లా: తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఆర్టీపీపీ దగ్గర, అనంతపురం కడప జిల్లాల బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసు బలగాల పికేటింగ్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు తాడిపత్రి నుండి వచ్చిఆర్టీపీపీ దగ్గర ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ప్లైయాష్ కోసం వచ్చి వాహనాలు ఆగిపోయాయి.
ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాస్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అటు తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరించాయి.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి, బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.