Home » JANASENA
అనంతపురం అర్బన, మే 3: ఒక్క అవకాశం ఇస్తే అనంత అర్బన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో శుక్రవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు.. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది..? దగ్గుబాటి: మా ఎన్నికల ప్రచారం ప్రతి రోజు అశేష జనవాహిని మధ్య సాగుతోంది. ఏ కాలనీకి వెళ్లినా మాకు స్థానిక ప్రజల నుంచి అ...
ప్రజలు ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డికి (CM Jagan) వెన్నులో నుంచి భయం తెప్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గిద్దలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు గెలిచేది నేనేనంటూ చెప్పుకొచ్చిన జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా ఉండనేది స్పష్టమవుతోంది. రోజురోజుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. బీజేపీ, జనసేనకు ఇచ్చిన సీట్లలో ఈజీగా గెలవచ్చని అంచనావేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయట.
తమ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే.. మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తామని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సీపీఎస్కు పరిష్కార మార్గం చూపిస్తామని.. దానికి సమానమైన ప్రత్యామ్నాయ మార్గాలను..
ఏపీ ఎన్నికల్లో రాజకీయమంతా కాపుల చుట్టూ తిరుగుతోంది. 2019 ఎన్నికల్లో కాపుల్లో ఎక్కువమంది వైసీపీకి ఓట్లు వేసినట్లు గత ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. అదేసమయంలో కాపుల ఓట్లు 3పార్టీలకు చీలిపోవడంతోనూ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగా కాపు సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. దీంతో ఆ సామాజికవర్గం ఓట్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఏపీలో పోలింగ్కు సమయం సమీపిస్తోంది. సరిగ్గా ప్రచారం ముగియడానికి పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పటినుంచి మరో ఎత్తు అన్నట్లు ఉండనున్నాయి రాజకీయ పార్టీల వ్యూహ.. ప్రతి వ్యూహాలు. గెలుపు కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదిరోజుల్లో ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు శ్రమిస్తున్నాయి.
ఓటరు తిరగబడితే ఏమవుతుంది.. ఫలితం తారుమరవుతుంది.. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు.. ఐదేళ్ల పాటు నాయకుల చుట్టూ ప్రజలు తిరిగితే.. ఎన్నికల ముందు మాత్రం నాయకులే ఓటర్ల ముందుకు వస్తారు. మాకు ఓటు వేయండి.. మీ సమస్యలన్నీ తీర్చేస్తామంటూ హామీలిస్తారు. కొంతమంది ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే.. మరికొంతమంది ఓటు ఎవరో ఒకరికి వేయాలి కదా అని ఓటు వేస్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సాధారణంగా చాలామంది ప్రజల్లో నాయకులు, పార్టీలపై కోపం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా ఉండవు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు వైసీపీ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.
ఎన్డీఏ అధికారంలోకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదని.. వైఎస్ జగన్ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఎద్దేవా చేశారు. మనకు జీరాక్స్ కాగితాలు ఇస్తారట.. మన ఆస్తి మీద మనకు హక్కు లేకుండా చేయడం మనల్ని దోచుకోవడం కాదా అని ప్రశ్నించారు.
గాజు గ్లాసు గుర్తు ఎలా వచ్చిందో తనకు తెలుసునని.. స్థానిక నేతల వత్తిడితోనే కొంతమంది అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఆ గుర్తు కేటాయించారని జగ్గంపేట ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోకు...సీఎం జగన్ (CM Jagan) మేనిఫెస్టోకు చాలా తేడా ఉందని చెప్పారు. జగన్ మేనిఫెస్టోను చూస్తే అతని మనస్సు ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత.. ఏపార్టీ బలమెంత.. ఎక్కడ చూసినా ఇదే చర్చ. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పక్కా గెలిచేదెవరో అక్కడి ప్రజలు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. కొన్ని చోట్ల పోటాపోటీ ఉంటుందంటున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అయితే పక్కాగా టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుస్తారంటూ వైసీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. మూడు పార్టీలు కలవడంతో బలం పెరిగిందని, మరోవైపు వైసీపీపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలంతా కూటమివైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.