Home » JANASENA
Pawan Kalyan: రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. అయితే ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.
కార్యాలయాల్లో కూర్చొని ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతకాలని చూస్తే గందరగోళానికి గురవుతామనీ, అందుకే జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
YSRCP Leaders: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత మరుసటి రోజు నుంచే వైసీపీకి షాక్లు మొదలయ్యాయి. నాడు మొదలైన బిగ్ షాక్లు నేటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రోజుకో నేత.. రెండ్రోజులకో ఇద్దరు ఎంపీలు రాజీనామాతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.
రాష్ట్రంలో గత సర్కారు కొనసాగించిన మానసిక, భౌతికదాడులకు చరమగీతం పాడాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై చెయ్యి వేయడానికి భయపడే పరిస్థితిని తీసుకురావాలని భావిస్తోంది.
Minister Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పులపాలు చేసి రైతులకు బకాయిలు చెల్లించలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోనే రైతులకు రూ.1674 కోట్లు కూటమి ప్రభుత్వంలో చెల్లించామని గుర్తుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ. 600 కోట్లు ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఈ ఏడాది రాజకీయరంగంలో జనసేనకు బాగా కలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా గుర్తింపు పొందింది. పోటీచేసిన అన్ని, శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఏడాది జనసేన ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.
గిరిజన తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు.
జనసేన నేత వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకల్లో మద్యం ఏరులై పారింది. అమ్మాయిలతో పూర్తి అశ్లీలంగా డ్యాన్సులు చేయించడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
నాగబాబును తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరగ్గా.. టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడిని నియమించారు. ఆ తర్వాత ఏపీ నుంచి మూడు రాజ్యసభ సభ్యుల స్థానాలు ఖాళీ అవ్వడంతో తప్పనిసరిగా నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో నాగబాబు రాజ్యసభ సభ్యత్వంపై..
జాతీయ స్థాయిలో ప్రజాదరణ కలిగి ఉండటంతో పాటు వయస్సు రీత్యా పవన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా అనే రీతిలో విజయసాయిరెడ్డి స్పందించారు. ఆరు నెలల క్రితం వరకు పవన్ కళ్యాణ్ను తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు అతడి వ్యక్తిగత జీవితంపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నాయకులంతా దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరని..