Home » ISRO
చంద్రయాన్-3 విజయవంతమైన తరుణంలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన లాంచ్ ప్యాడ్ను నిర్మించిన ఇంజినీర్లకు దాదాపు 17 నెలల నుంచి జీతాలు అందడం లేదని కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఏ మేరకు ఉందో తెలియడం లేదు.
అందాల చందమామను భారతీయులకు చేరువ చేసిన చంద్రయాన్-3 విజయం మధ్య తరగతి ప్రజలకు స్ఫూర్తిని, ప్రేరణను ఇస్తోంది.
యావత్ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన చంద్రయాన్-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడినుంచి ఏమిటి..? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్ విక్రమ్..
భూమిపై చంద్రోదయం అయ్యే వేళలో చంద్రుడిపై ఓ నవోదయం! భారత కీర్తిచంద్రికలు ఆచంద్రతారార్కం నిలిచే మహాద్భుత ఘట్టం! మానవుడే మహనీయుడై గ్రహరాశులనధిగమించి.. మన ‘ప్రజ్ఞాన్’ పాటవాలను విశ్వవ్యాప్తం చేసిన చారిత్రక సన్నివేశం!
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ ‘జయహో భారత్’ అని వేనోళ్లా కీర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 ప్రయోగం గురించి ప్రశంసించబోయి రాజస్థాన్కు చెందిన క్రీడా శాఖా మంత్రి అశోక్ చంద్నా పరువు పోగొట్టుకున్నారు.
జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3కి సంబంధించి.. ఈ ఘనత సాధించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కమ్మని కబురు దేశ ప్రజలకు అందించింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్కు, బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంతో(MOX-ISTRAC) కమ్యూనికేషన్ లింక్ ఏర్పడినట్లు ట్విటర్ వేదికగా ఇస్రో వెల్లడించింది. అంతేకాదు.. ల్యాండర్ చంద్రుడిపై దిగాక తీసిన ఫొటోలను కూడా ట్విటర్లో పోస్ట్ చేసింది.
చంద్రుని దక్షణ ధృవంపై చంద్రయాన్-3 (Chandrayaan-3)విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల(ISRO scientists)కు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం కావాలని కోరుకుంటూ చంద్రయాన్-3 కోసం అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. జాబిల్లిపై భారత్ జెండా పాతింది. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అయింది. 40 రోజులు ప్రయాణించి చంద్రయాన్-3 జాబిల్లిపై దిగింది. ఇప్పుడు ‘వాట్ నెక్ట్స్’ అనే ప్రశ్న చాలామందిలో ఉత్సుకత రేకెత్తిస్తోంది.
జాబిల్లి దక్షిణ ధృవంపై తొలి అడుగు వేసి చరిత్ర సృష్టించాలనుకుంటున్న చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 mision) ల్యాండర్ విక్రమ్ (Lander Vikram) సంసిద్ధంగా ఉన్న వేళ యావత్ భారతావని ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తోంది. అద్భుత ఘట్టంతో చరిత్ర సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు టెన్షన్ టెన్షన్గా వేచిచూస్తున్నారు...
చంద్రయాన్-3 విజయవంతమవడంతో ప్రపంచ చరిత్రలో భారత దేశ సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. ప్రతి భారతీయునికి గర్వకారణంగా నిలిచే ఈ విజయం యావత్తు మానవాళికి చెందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.