Home » Israel
ఇజ్రాయెల్ మరోసారి హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని గాజాలో భారీ వైమానిక దాడి చేపట్టింది. హమాస్ సైనిక విభాగం కొత్త చీఫ్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ఒడెహ్ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ఏదో ఒక రకమైన లబ్ది పొందాలని భావించిన పాక్.. ఇప్పుడు అడ్డకత్తెరలోపడింది. ట్రంప్ పెట్టిన కొత్త మెలికతో ఏం చేయాలో పాలుపోక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు దాపురించింది..
ఒకవైపు యుద్ధ విరమణ ఒప్పందం కోసం కీలక చర్చలు జరుగుతుండగానే, మరోవైపు దక్షిణ ఇరాన్ ప్రాంతంలో మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజాగా 'ఆత్మరక్షణ దాడులు' నిర్వహించింది.
60 రోజుల కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ, చమురు ఆంక్షల సడలింపులపై అమెరికా-ఇరాన్ ప్రాథమిక ఒప్పందానికి వస్తున్నప్పటికీ, తమ అణు నిల్వలను అప్పగించే అంశం ఇందులో భాగం కాదని ఇరాన్ అంటోంది. హెజ్బొల్లాతో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ద్రాక్ష తోటలు పెరగడానికి, రుచికరమైన వైన్ తయారీకి పచ్చని వాతావరణం, సమృద్ధిగా నీరు ఉండాలని అనుకుంటారు. కానీ, ఇజ్రాయెల్లోని ఎండలు మండిపోయే 'నెగెవ్' ఎడారి ఈ అంచనాలను తలకిందులు చేసింది. ఎడారిలో ప్రత్యేకమైన ద్రాక్ష తోటల పెంపకంతో అద్భుతమైన వైన్ను తయారు చేసి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు అక్కడి రైతులు.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించారు. వాషింగ్టన్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
లెబనాన్కు చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ఇజ్రాయెల్కు షాకిచ్చింది. ఐరన్ డోమ్ వ్యవస్థకు చెందిన మిసైల్ లాంచింగ్ యూనిట్ను ఎఫ్పీవీ డ్రోన్లతో ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన ఫుటేజీని కూడా విడుదల చేసింది.
ఇరాక్లోని పశ్చిమ ఎడారి ప్రాంతంలో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి చోట స్థానిక గొర్రెల కాపరి ఏదో అసాధారణమైనదాన్ని గమనించాడు. హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయి. మారుమూల ప్రాంతంలో వింత కార్యకలాపాలు జరుగుతున్నాయి.
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం ఐదుగురు మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్ వైపు రాకెట్లు ప్రయోగించింది.