Home » IPL
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల దందా కలకలం రేపింది. బహిరంగంగానే స్టేడియం బయట తిరుగుతూ బ్లాక్లో ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ నకిలీ టికెట్ల మోసాలపై క్రికెట్ అభిమానులను టీజీసీఎస్బీ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్లు, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ టికెట్లను కేటుగాళ్లు విక్రయం చేస్తారని హెచ్చరించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు నెలకొల్పాడు.
గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ను టీమిండియా టీ20 జట్టులోకి తీసుకుని కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై ఆస్ట్రేలియా దిగ్గజం, పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
ప్లే ఆఫ్స్ సమరం సమీపిస్తోన్న నేపథ్యంలో.. ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ అందినట్లు తెలుస్తోంది. గాయం కారణంగా గత ఏడు మ్యాచ్లకు దూరమైన ఆర్సీబీ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. ప్లే ఆఫ్స్కు ముందే జట్టుతో చేరనున్నట్లు సమాచారం.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న భారీ షాట్లపై గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. అతడి బ్యాట్లో ఏఐ చిప్ ఉందంటూ పాక్ క్రికెట్ విశ్లేషకుడు నౌమన్ నియాజ్ సరదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
ఐపీఎల్ టికెట్ల వివాదం హైదరాబాద్లో ఉద్రిక్తతకు దారితీసింది. టికెట్ల కోసం ఓ వ్యక్తి.. సన్ నెట్వర్క్ హైదరాబాద్ కార్యాలయ సిబ్బందిని బెదిరించడంతో పాటు ఆఫీసుపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. జైపూర్ వేదికగా లఖ్నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎల్ఎస్జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. రాజస్థాన్కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.