Home » India vs West indies
భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్లోని మొదటి 3 టీ20లు వెస్టిండీస్లో జరగగా చివరి 2 టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో గల సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ మైదానంలో జరగనున్నాయి.
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్(Hardik Pandya) పాండ్యా ఇటీవల వరుసగా విమర్శలకు గురవుతున్నాడు. వన్డే సిరీస్ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(west indies cricket board) సరైన వసతులు కల్పించడంలేదని మాట్లాడి పలువురు నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురిసింది.
మూడో టీ20లో భారత్ ముందు వెస్టిండీస్ 160 పరుగుల టఫ్ లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ గత రెండు టీ20ల మాదిరిగానే స్లోగా ఉండడంతో చేధన అంత సులభం కాకపోవచ్చు.
కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన జేసన్ హోల్డర్ స్థానంలో చేజ్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్లోని మొదటి రెండు మ్యాచ్లు గెలిచి 2-0తో అధిక్యంలో ఉన్న విండీస్ మూడో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు భారత జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.
భారత క్రికెటర్, పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీతో సమావేశం అనంతరం 37 ఏళ్ల తివారీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో స్నేహాశిష్ గంగూలీ సూచన మేరకు తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయంపై మనసు మార్చుకున్నట్లు సమాచారం.
టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దుల కూతురు సమైరాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తన తొలి హాఫ్ సెంచరీ వేడుకలను ఆ చిన్నారికి అంకింతం చేశాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల సమైరాతో తనకున్న సాన్నిహిత్యాన్ని తిలక్ వర్మ వ్యక్తపరిచాడు.
రెండో టీ20 మ్యాచ్లో తమ బ్యాటింగ్ ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై హార్దిక్ ప్రశంసలు కురిపించాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. అన్ని రకాల టీ20 క్రికెట్లో 150 వికెట్లు, 4 వేల పరుగుల చేసిన మొదటి భారత ఆల్రౌండర్గా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా హార్దిక్ ఈ రికార్డును అందుకున్నాడు.
ఐదు టీ20 సిరీస్(Five T20 series)లో వెస్టిండీస్ జట్టు(West Indies team) అదరగొడుతోంది. నికోలస్ పూరన్(Nicholas Pooran) (40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) ఎడాపెడా బాదుడుకు రెండో మ్యాచ్లోనూ భారత జట్టు(Indian team)కు చుక్కెదురైంది.