Home » HYDRA
తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా . దీనిని ఏర్పాటు చేసి మూడున్నర నెలలు దాటింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న చాలా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది.
ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను చెరబట్టిన వారిపై కన్నెర్ర చేసిన హైడ్రా(HYDRA).. తాజాగా రూటు మార్చింది. ఆక్రమణల కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇస్తూ.. చెరువులు, కుంటల పునరుద్ధరణకు రంగంలో దిగింది.
Telangana: హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందని రంగనాథ్ అన్నారు. హైడ్రా నోటీసులు అక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయని వెల్లడించారు. ఈరోజు ఉదయం అంబర్పేట్లోని బతుకమ్మకుంటను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బతుకమ్మకుంటపై రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్(Aminpur) మున్సిపాలిటీలో సోమవారం హైడ్రా సిబ్బంది పర్యటించడంతో అలజడి రేగింది. గతంలో మున్సిపల్ పరిధిలోని పటేల్గూడ(Patelguda)లో రెవెన్యూ, హైడ్రా బృందాలు సంయుక్తంగా 28 ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే.
బెంగళూరులో హైడ్రా అధికారుల బృందం పర్యటన ముగిసింది. పర్యటన సందర్భంగా కర్ణాటక ట్యాంక్స్ కన్జర్వేషన్ అండ్ డెవల్పమెంట్ అథారిటీ (కేటీసీడీఏ) సీఈవో రాఘవన్తో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బృందం సమావేశమైంది.
గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు.
తక్కువ ఖర్చుతో కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులో 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు, తీసుకుంటున్న చర్యలపై.. హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనున్నారు.
మూసీ ప్రక్షాళనకు, హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
‘హైడ్రా ఎక్కడ తన ఇల్లు కూల్చివేస్తుందో అని మూడు రోజులపాటు ఆందోళన చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇది ముమ్మాటికీ హైడ్రా అనే అరాచక సంస్థ ద్వారా సీఎం రేవంత్రెడ్డి చేయించిన హత్య.
ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో అర్ధం పర్ధం లేని నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పేద మహిళ ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైందన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోందని కేటీఆర్..