Home » HYDRA
‘ఎందుకంత తొందర.. ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలే తప్ప ఇష్టం వచ్చినట్లు కాద’ంటూ గురువారం హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. వీటన్నింటినీ నమోదు చేయడానికి రిజిస్టర్ పెట్టాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించింది.
హైదరాబాద్(Hyderabad) పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా(HYDRA)ను మరింత పటిష్టం చేయాలని పలువురు భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో హైడ్రా రంగంలోకి దిగింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచే ఇసుక లారీల తనిఖీని మొదలుపెట్టింది.
Hydra: హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి నగర శివారులో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది హైడ్రా. కోమటికుంటలో అక్రమ నిర్మాణాలపై యజమానులకు నోటీసులు ఇవ్వగా.. స్పందిచకపోవడంతో కూల్చివేసింది హైడ్రా.
నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతలన్నింటితో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. బుధవారం మూసీ నది వెంట జరిగిన కూల్చివేతలు హైడ్రా చేపట్టినట్టు దుష్ప్రచారం చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చెరువుల ఆక్రమణలపై హైడ్రా(HYDRA) ఉక్కుపాదం మోపుతోంది. కొంపల్లి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ సరిహద్దుల్లోని తుమ్మారు చెరువులో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల్లో కొందరు తమ భూమి ఉందని మట్టితో చెరువును పూడ్చారు.
చెరువుల్లో ఎవరై నా మట్టి పోస్తే ఆ సమాచారం హైడ్రా(HYDRA)కు తెలపాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నంబరు 90001 13667ను కేటాయించారు.
ఇప్పటికే హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకొనే బాధ్యతను హైడ్రా చేపట్టిన సంగతి తెలిసిందే. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో సమీక్షించారు.
CM Revanth reddy: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు మరో బాధ్యత కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతోన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటి హైడ్రాకు మరో కీలక బాధ్యతను అప్పగించారు.
‘వారాంతాల్లో ప్రత్యేకంగా ఆదివారం రోజు కూల్చివేతలు చేపట్టవద్దు అని చెప్పినా మీరు వినరా’? అని హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం కూల్చివేతలు చేపట్టాల్సినంత అత్యవసరం ఏమొచ్చింది? అంత తొందర ఎందుకు?