Home » HYDRA
హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా మళ్లీ యాక్షన్లోకి దిగింది. మియాపూర్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. అంతేకాకుండా, తుర్కయంజాల్ మున్సిపాలిటీలో రోడ్డుకు అడ్డంగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తోంది. హైడ్రా అధికారుల పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా పేరుతో తాను వసూళ్లకు పాల్పడుతున్నట్లు అమీన్పూర్ సంక్షేమ సంఘం పేరుతో ఒక నకిలీ లేఖ సోషల్మీడియాలో వైరల్ అవుతోందని, దీని వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ.ఫహీమ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Faheem Fake Letter Controversy: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ ఫహీమ్.
ఏ ప్రాంతంలో చెరువు ఉంది..? దాని విస్తీర్ణమెంత..? వరద కాలువలు, నాలాలు ఎక్కడున్నాయి..? వంటి వివరాలతోపాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించిన సమస్త సమాచారం ఒక్క క్లిక్తో ప్రజలు తెలుసుకునేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం డ్రా కారణంగా పడిపోయిందని చెప్పడం తప్పు అని అన్నారు. మార్కెట్లో స్తబ్దతకు హైడ్రా బాధ్యత వహించదని, హైడ్రా ఏర్పాటుకముందే అమ్ముడుపోని ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు.
నగరంలో.. ప్రభుత్వ స్థలాలు, భవనాలు, ప్రభుత్వ ఆస్తులు, చెరువు, కుంటలను కాపాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హైడ్రా.. మళ్లీ దూకుడు పెంచింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అల్వాల్ మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలాల ఆక్రమణలపై విచారణ ప్రారంభించింది.
రంగారెడ్డి జిల్లా హల్మాస్గూడ బోయిన్పల్లి కాలనీలో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు.
హైడ్రా పేరుతో ఎవరు సెటిల్మెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇలాంటివి ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని కోరారు.
హైడ్రా పేరుతో ఇక సెటిల్మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వంశీరామ్ బిల్డర్స్పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఫిర్యాదు అందిందని తెలిపారు.
హైడ్రా కమిషనర్ ఆవుల వెంకటరంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది హైడ్రా పేరుచెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై కఠినచర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.