Home » Heavy Rains
ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే మూడు గంటల వ్యవధిలో పిడుగులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలోని ములుగు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల తీరప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలు.. ఇలా విభిన్న వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మారే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పశ్చిమ బెంగాల్ నుంచి మన్నార్ జలసంధి వరకు ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది.
మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పరిసరాల్లో కేరళ ఆనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముంది.
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఏపీలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(గురువారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.