Home » Heavy Rains
ఏపీలో ఈనెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
చెన్నై నగరాన్ని వర్షాలు వదలడం లేదు. వారానికోసారి తుపాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. మళ్లీ 29వతేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఈనెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ వెల్లడించింది.
వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఈనెల 25వతేదీ వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఱ తెలిపింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడటంతో రాష్ట్రంలో 8 జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరం గా ఉంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణించే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తుండటంతో తూత్తుకుడి, నాగపట్టినం, కారైక్కాల్ ప్రాంతాల మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళకుండా మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబరు 16న నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి.
బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17 నుంచి డిసెంబరు 7వ తేది వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు.
వరుస అల్పపీడనాల ప్రభావంతో.. రాష్ట్రంలో ఈ నెల 16వ తేది నుంచి ‘ఈశాన్య’ రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో అక్టోబరు నుంచి ఒకేసారి తీవ్రమైన ఎండ, తీవ్రమైన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే.