Home » Heat
యావత్ భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో ఉడికిపోతోంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి సుమారు 16,344 వడదెబ్బ కేసులు నమోదు అయ్యాయి
వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.
అసలే మే నెల. భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయే తెలిసిందే. మే నెల చివరి వారం వరకు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. అయితే కొన్ని రోజుల క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు(Heat Wave Alerts) జారీ చేసింది.
ఎండల వేడితో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది.
ఇంకా మే నెల రాలేదు కానీ.. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో వడగాలులు వీస్తున్నాయి. తెలంగాణలోనూ...
భానుడి భగ.. భగలు కాస్త తగ్గడంతో నగరవాసులకు(Hyderabad) ఎండల నుంచి ఉపశమనం లభించింది. రెండు రోజుల క్రితం 40-42 డిగ్రీలు నమోదైన పగటి ఉష్ణోగ్రతలు మంగళవారం 37-38 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం(Weather) చల్లబడి ఈదురుగాలులు వీస్తుండడంతో వడగాల్పుల తీవ్రత తగ్గింది. ద్రోణి గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్(Gujarat) నుంచి మధ్య మహారాష్ట్ర(Maharashtra) వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం..
హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం.. మండుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి హీట్ వేవ్స్ అలెర్ట్ ప్రకటించారు. ఎండ వేడిమితో పాటు వడగాలుల తీవ్రత పెరిగింది.
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
గత కొన్నిరోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 అయ్యిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని చల్లని సమాచారం ఇచ్చింది.
అవునూ.. కాలం మారింది. వర్షా కాలం లేదు.. చలి కాలం లేదు.. ఉన్నదంతా వేసవి కాలమే. అవును మరి.. సరైన వర్షాలు కురవక తాగునీరు లేక, పంటలు పండక ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండలతో భయభ్రాంతులకు గురవుతున్నారు.