Home » Heat Waves
ఉత్తర భారతదేశం (North India)లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సహా ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. 45 నుంచి 50డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు(High temperature) నమోదు అవుతుండడంతో వేడిగాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఉత్తర భారతదేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో వేడి గాలుల(హీట్ వేవ్స్)కు ప్రజలు అల్లాడిపోతున్నారు.
వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు(heat wave) మండిపోతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో హీట్ వేవ్ తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏసీ జాకెట్ ధరించిన పోలీసుల గురించి వార్త చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి ఏ రూపంలో ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పవు. స్మార్ట్ ఫోన్కూ వర్తిస్తుంది. ఎండలనే కాదు, గేమ్స్ తదితరాలతో ఎక్కువగా ఉపయోగించినా ఫోన్ వేడెక్కుతుంది. ఫలితంగా ఇబ్బందులకూ అవకాశం ఉంటుంది. దరిమిలా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
మాడు పగిలే ఎండ.. ఉక్కిరిబిక్కిరి చేసిన వాన! రెండూ ఒకేరోజు విరుచుకుపడటంతో ఆ కష్టనష్టాలు అన్నీఇన్నీకావు! ఎండదెబ్బకు ఇబ్బందిపడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకూ వణికిపోయారు! వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి.. విద్యుత్తుస్తంభాలను పడగొట్టి.. ఇళ్లపై రేకులను గల్లంతు చేసి.. క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమిని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 33మంది సిబ్బంది శనివారం ఎండల కారణంగా మృతిచెందారు. వీరిలో హోంగార్డులు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.
రాష్ట్రంలో ఎండలు తీవ్రత కొనసాగుతోంది. మూడ్రోజులుగా 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. శనివారం ఒక్కరోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)లో 45.7, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 45.5,
దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు(heat wave) కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ కారణంగా 210 మందికి పైగా మరణించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలో ఓ వ్యక్తి (40) వడ దెబ్బ కారణంగా దుర్మరణం చెందాడు. శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీలు చేరడంతో అవయవాలన్నీ విఫలమై కన్నుమూశాడు.