Home » Hardik Pandya
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే ఉంది. దీంతో ఆటగాళ్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని జట్లన్నీ భావిస్తున్నాయి. అయితే ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదంపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. తన కెరీర్లో దాదాపుగా అన్ని మ్యాచ్లు రోహిత్ శర్మ సారథ్యంలోనే ఆడానని అన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేసుకున్నాడు. తన కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ శర్మ ఎలాంటి ఇబ్బంది పడకపోవచ్చని, హిట్ మ్యాన్తో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రానున్న ఐపీఎల్ సీజన్కు ముందు ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై పెద్ద దుమారమే రేగుతోంది.
ఐపీఎల్ 2024(ipl 2024) కోసం అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ తమ జట్లలో చేరడం ప్రారంభించారు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా(hardik pandya) ఈసారి ముంబై ఇండియన్స్కు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో పాండ్యాకు సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూం పూజ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
చీలమండ గాయం కారణంగా చాన్నాళ్లపాటు క్రికెట్కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి బ్యాట్ చేతపట్టాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న నేపథ్యంలో ముంబై ప్రాక్టీస్ సెషన్లో ముమ్మర కసరత్తులు ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. గాయం కారణంగా సుదీర్ఘ కాలంపాటు టీమిండియాకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్లో బరిలోకి దిగాడు.
పలువురు భారత ఆటగాళ్లపై బీసీసీఐ అసంతృప్తితో ఉందా? తమ ఆదేశాలను పాటించకపోవడంపై గుర్రుగా ఉందా? కొంతమంది ఆటగాళ్లు రంజీ క్రికెట్ కంటే ఐపీఎల్కు ప్రాధాన్యతం ఇవ్వడంపై ఆగ్రహంతో ఉందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తొలగించి.. హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంపై క్రీడాభిమానులు ఎంతలా మండిపడ్డారో అందరికీ తెలుసు. ఆ ఫ్రాంచైజీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ.. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ సాధించిపెట్టిన రోహిత్ని ఎందుకు సారథిగా పక్కకు తప్పించారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
జూన్లో జరగబోయే టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. ఇప్పటికే సెలెక్టర్లు ఆ దిశగా కసరత్తులు కూడా మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు కూడా ప్రపంచకప్లో భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందనే అంశంపై తమ అభిప్రాయాలను చెబుతున్నారు.