Home » Harbhajan Singh
కోల్ కతా వైద్యురాలి మృతి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. మృతురాలికి న్యాయం జరగాలని, వీలైనంత త్వరగా నిందితుడిని ఉరి తీయాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదే అంశంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీకి మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్ రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతున్నారు. క్యాన్సర్కు లండన్లో గల కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవల భారత్ తిరిగొచ్చారు. ఆ వెంటనే మృతిచెందారు. గైక్వాడ్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రపంచ క్రికెట్లో వికెట్ కీపింగ్లో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పిన ఆటగాడు ఎంఎస్ ధోనీ. వికెట్ కీపింగ్ బ్యాటర్లలో ధోనీని మించిన ఆటగాడు దాదాపు లేడనే చెప్పాలి. ఆడమ్ గిల్క్రిస్ట్, కుమార సంగక్కర కూడా కీపింగ్ విషయంలో ధోనీ తర్వాతనే అని చాలా మంది మాజీ క్రీడాకారులు గతంలో అభిప్రాయపడ్డారు.
దాదాపు పదేళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లోకి అడుగుపెట్టింది. గురువారం ఇంగ్లండ్తో సెమీ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడి విజయం సాధించింది. భారత్ సాధించిన విజయంపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ మాత్రం ఎప్పటిలాగానే టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు.
టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అమెరికా వంటి పసికూన చేతిలో కూడా ఓటమి పాలై లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై ఆ దేశ అభిమానులు, మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ హెడ్ కోచ్ గ్యారీ కీర్స్టెన్కు కూడా విమర్శల తాకిడి తప్పడం లేదు.
అప్పుడప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లు తమ నోటిదూల ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా.. భారతీయులపై అనవసరంగా నోరు పారేసుకుంటుంటారు. మైదానంలో భారత్కి ధీటుగా పోటీనిచ్చే చేతకాక..
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్పై చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన విజయాన్ని పక్కనపెడితే.. ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రయోగంపై మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తొమ్మిదో స్థానంలో..
ప్రస్తుతం భారత జట్టుకి అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ తర్వాత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు ఇప్పించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ దిశగా అతడ్ని సిద్ధం చేస్తున్నారు.
ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ జట్టు భారీ ధరకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన ఓ డబ్బింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దానిని హర్భజన్ సింగ్ షేర్ చేశారు.
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హిందీలో కామెంటరీ చేసిన ఆయన.. అనుష్క శర్మ, అథియా శెట్టిలపై ‘సెక్సిస్ట్’ వ్యాఖ్యలు చేశాడు. కెమెరామేన్ అనుష్క, అథియాలను..