• Home » Hanuman Jayanti

Hanuman Jayanti

BJP: శ్రీరామ చంద్రుణ్ణి అందరూ దర్శించుకోవచ్చు.. హనుమాన్ శోభాయాత్రలో కిషన్‌రెడ్డి

BJP: శ్రీరామ చంద్రుణ్ణి అందరూ దర్శించుకోవచ్చు.. హనుమాన్ శోభాయాత్రలో కిషన్‌రెడ్డి

Telangana: నగరంలోని గౌలిగూడ మందిర్‌ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అయితే శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిర్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజసింగ్, మాజీమంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో రాం మందిర్ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారన్నారు.

Hyderabad: హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం.. వేలాదిగా పాల్గొన్న భక్తులు

Hyderabad: హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం.. వేలాదిగా పాల్గొన్న భక్తులు

Telangana: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర మొదలైంది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బన్సీలాల్ పేట్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర సాగనుంది.

Hanuman Jayanti: భాగ్యనగరంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.. కాసేపట్లో శోభాయాత్ర

Hanuman Jayanti: భాగ్యనగరంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.. కాసేపట్లో శోభాయాత్ర

Telangana: నగరంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిటీలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలు సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. దీంతో వీర హనుమాన్ దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది.

Hanuman Jayanthi: రేపు హనుమాన్ శోభాయాత్రకు పూర్తైన ఏర్పాట్లు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Hanuman Jayanthi: రేపు హనుమాన్ శోభాయాత్రకు పూర్తైన ఏర్పాట్లు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

రేపు (మంగళవారం) హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రేపు ఉదయం 11:20 గంటలకు ఆంజనేయుని శోభా యాత్ర ప్రారంభం కానుంది.

Liquor Lovers: మద్యం ప్రియులకు ఆరు రోజుల వ్యవధిలోనే మరో షాక్..

Liquor Lovers: మద్యం ప్రియులకు ఆరు రోజుల వ్యవధిలోనే మరో షాక్..

మందు బాబులకు మళ్లీ షాక్. ఆరు రోజుల వ్యవధిలోనే మద్యం ప్రియులకు అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణలో మంగళవారం (ఏప్రిల్ 23) నాడు నగర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేది నాడు మద్యం షాపులు, వైన్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ఆరు రోజులు తిరగకముందే అంటే రేపు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Hanuman Jayanti 2023: హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా ఈ రంగు దుస్తులు ధరించకూడదా? లేదంటే.. ప్రతికూల ఫలితాలు తప్పవా!

Hanuman Jayanti 2023: హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా ఈ రంగు దుస్తులు ధరించకూడదా? లేదంటే.. ప్రతికూల ఫలితాలు తప్పవా!

భీకర ఆకారుడై, వందయోజనాల దూరం అవలీలగా లంఘించిన హనుమ.. లంకలో ప్రవేశించి..!

తాజా వార్తలు

మరిన్ని చదవండి