Home » Hamas
హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ శనివారం ముప్పేట దాడులు చేసింది.
గాజాలో ఆరుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఆ దేశ సైన్యం ఆదివారం ప్రకటించిన వెంటనే.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ హమాస్ ఉగ్రవాద సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హత్య, బీరూట్లో హిజ్బుల్లా కమాండర్ హత్యలు ఇజ్రాయెల్ పనేనని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల హిజ్బుల్లా గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే.
మరో యుద్ధం అంచున ఉన్న పశ్చిమాసియాలో మరో భీకర దాడి..! సెంట్రల్ గాజాలోని తబీన్ పాఠశాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వరుసగా మూడు క్షిపణులను ప్రయోగించింది. హమా్సపై పది నెలలుగా టెల్ అవీవ్ సాగిస్తున్న యుద్ధంలో ఇదొక అతి పెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు.
గాజా తూర్పు ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఓ పాఠశాల భవనంలో ఉన్న పాలస్తీనీయులపై దాడికి తెగబడ్డాయి. దాంతో వంద మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రార్థనలు చేసే సమయంలో దాడి జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత వారం కూడా గాజాలో గల నాలుగు పాఠశాలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా మిలిటరి కమాండ్ ఫూద్ షుక్రు హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయెల్పై దాడి చేస్తామనిఇరాన్ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఈ రోజు (సోమవారం) దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉండాలని జీ7 సదస్సులో సూచించిందని యాక్సిస్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
హమాస్కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇరాన్ రక్షణలో ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన మరునాడే హమాస్ మిలిటరీ చీఫ్, ఇజ్రాయెల్పై దాడుల వ్యూహకర్త మహమ్మద్ డెయిఫ్ హతమయ్యాడు.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. టెహ్రాన్లోని ఆయన నివాసం లక్ష్యంగా దాడి చేశారు. దాంతో ఇస్మాయిల్ చనిపోయాడని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఖతార్లో ఇస్మాయిల్ హనియా మంగళవారం పలు రాజకీయ కార్యకలపాల్లో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
హమాస్ మిలటరీ కమాండర్ మహమ్మద్ దెయిఫ్ లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 71 మంది మృతి చెందారు. 289 మంది గాయపడ్డారు. అయితే దాడిలో మహమ్మద్ దెయిఫ్ చనిపోయాడో లేదో తెలియలేదు.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు(Israel Hamas War) ప్రస్తుతం తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం గాజా(gaza) నగరంలో జరిగిన హింసాత్మక ఘటనలో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత చెందారు.