Home » God
మండలంలోని ఒంటికొండ గ్రామంలో మంగళవారం గావుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. అక్కదేవతల ఉత్సవాలు ముగిసిన అనంతరం మరుసటి రోజు పోతలయ్యస్వామికి ప్రతిఏటా ఇక్కడ గావుల మహోత్సవాన్ని నిర్వహి స్తారు.
మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉట్లపరుష ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం ఉట్ల పరుష కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది.
ఫాల్గుణ బహుళ ఏకాదశిని పురస్క రించుకుని మంగళవారం సాయంత్రం కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి నూతన వస్త్రార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. దాదాపు వెయ్యి చీరలను అమ్మవారి ఎదుట ఉంచి పూజలు చేశారు.
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జన్మతిథిని పురస్కరించు కుని గురువారం మొదటి రోడ్డు లోని రాఘవేంద్రస్వామి మఠం లో వేడుకలను భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి బృందావనా న్ని వివిధ రకాల పుష్పాలతో న యనమనోహరంగా అలంకరిం చారు.
మండలంలోని దాదులూరు పోతలయ్య స్వామికి భక్తులు జ్యోతులు, బోనాలు సమర్పించి మెక్కు లు తీర్చుకున్నారు. దాదులూరు పరుషలో రెండో రోజైన సోమవారం పోతలయ్య, చెన్నకేశవ స్వామి, బంగారు లింగమయ్య స్వామికి ఫల హారపు బండ్లతో భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి మెక్కులు తీర్చు కున్నారు.
కుందుర్పి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని వడ్డీపాలెం గ్రామంలో వెలిసిన గుడిబండ ఆంజనేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. 11 ...
జిల్లాకేంద్రంలో మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలు శని వారం నాటికి ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం కాశీవిశ్వేశ్వరుడికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు త్రిశూలస్నానం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు.
మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలో మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు గురువారం బ్రహ్మరథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని కల్యాణమండపంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయంలో ఉదయం రథాంగ హోమం, రథాంగబలి నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.
మహా శివరాత్రి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. క్యూ లైనలలో నిలబడి మరీ శివపార్వతులను దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ...