Home » God
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరిలో వెలసిన నరసింహ స్వామిని జిల్లా అడిషన కోర్టు న్యాయాధికారి సత్యవాణి శనివారం దర్శించు కున్నారు. ఏడీజే వెంట స్థానిక న్యాయాధికారులు ఎస్ ప్రతిమ, పీ మీనాక్షి సుందరి ఇతర సిబ్బంది ఆలయానికి వచ్చారు. వారికి తూర్పు రాజగోపురం వ ద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం న్యాయాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ విశిష్టత వివరించారు. ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పట్టణంలోని శ్రీనివాసనగర్లో వెలసిన లక్ష్మీవెంక టేశ్వరస్వామి ఆలయంలో మూడో శనివారం ఏడు శనివారాల వ్రతాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రాజేశ స్వామి మూల విరాట్టును పట్టువస్ర్తాలతో అలంకరించి పూజలు చేశారు. అ నంతరం మహిళల చేత ఏడు శనివారాల వ్రతం చేయించారు.
మండలంలోని గడేకల్లు గ్రామంలో వెలసిన వేములవాడ భీమలింగేశ్వరస్వామి మహా రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం స్వామికి ప్రీతి పాత్రమైన మద్యాన్ని, మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తెల్లరుజామున ఉత్సాయంను ఆలయం వద్ద నుంచి గ్రామ చావడి వరకూ లాగారు. సాయంత్రం నిర్వహించిన మహా రథోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. కర్నూలు, బళ్లారి, అనంతపురం, బెంగళూరు, వంటి ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ..
సఖినేటిపల్లి లంక గ్రామంలో అద్భుతం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.
పట్టణ పరిధిలోని నింకంపల్లి రోడ్డులో వెలసిన ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రతి యేటా ఆ నవాయుతీగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం లో భాగంగా ఉదయం అమ్మవారికి వి విధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. పెద్ద సంఖ్యలో మహిళ లు ఊరేగింపుగా బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.
మడకశిర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని చంద్రబావి గ్రామంలో వెలసిన దత్తత్రేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మె ల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
మండలంలోని నిడిమామిడి పంచాయతీ గ్రామంలో శుక్రవా రం నిర్వహించిన ఉట్లపరుష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి యేటా మాదిరి గానే తొలి ఏకాదశి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్లపరుషలో నిడిమామిడి పంచా యతీలోని కత్తివారిపల్లి తదితర ఏడుగ్రామాల యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇం దులో తిరుపాల్ అనే యువకుడు విజేతగా నిలిచాడు. ఉత్సవం సందర్భంగా ముఖ్య అతిథు లుగా గ్రామానికి వచ్చిన ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, మా జీమంత్రి పల్లె రఘునాథరెడ్డికి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.
గూగూడు కుళ్లాయిస్వామి చివరి దర్శనం వేడుకను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం రెడ్డి వంశీయులు కుళ్లాయిస్వామి పీరును ఆలయం వెలుపలకు తీసుకువచ్చి, గంటపాటు భక్తులకు దర్శనం కల్పించారు. కుళ్లాయిస్వామి గోవిందా గోవింద అంటూ భక్తులు గోవింద నామస్మరణం చేశారు. స్వామివారి చివరి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున ...
తా లూకాలోని దాదాపు 15గ్రా మాల ఇలవేల్పు గా కొలిచే లక్ష్మీ నరసింహ స్వా మి జాతర మ హోత్సవాన్ని ఆ షాఢ ద్వాదశి రోజైన గురువా రం మీనకుంటపల్లిలో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఎద్దులబండ్లను, గొర్రెలు, మేకలను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించా రు. అదేవిధంగా రాంపేట గ్రామం నుంచి పాలకడవలతో పూజారులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా... మహిళలు జ్యోతులు మోస్తూ వారిని అనుసరించారు. ప్రదక్షిణల అనంతరం పాలకడవలతో స్వామివారి విగ్రహాలకు అభిషేకం చేశారు.
పట్టణంలోని చెరువురోడ్డు సమీపంలో కొండపై వెలసిన ఘనగిరి గర్జ ఆంజనేయస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామికి గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయ సమీపంలో సాయంత్రం నిర్వ హించిన ఉట్లపరుష భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఉట్లమాను ఎక్కడానికి యువ కులు పోటీ పడ్డారు.