Home » Gas cylinder
భగభగ మండే ఎండల్లో గ్యాస్ బండ చుక్కలు చూపిస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం వినియోగ దారులు గంటల తరబడి క్యూలో వేచియుండాల్సి వస్తోంది.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు జిల్లాలో తగినన్ని అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు.
కొంతకాలంగా ఢిల్లీలో కట్టెల పొయ్యిల వాడకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిల వాడకానికి అధికారికంగా అనుమతి నిచ్చింది.
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన సమస్యలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
గ్యాస్ సరఫరా అంశంపై పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
దేశ వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం నెలకొంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలు, హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్ కు రావాల్సిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో, గ్యాస్ ఏజెన్సీల ముందు సామాన్యులు గంటల తరబడి క్యూ కడుతున్నారు.
ఎల్పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, 'ప్యానిక్ బుకింగ్' అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది.
గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా పెద్ద సంఖ్యలో హోటళ్లు మూతపడుతున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆహార పదార్థాలతో పాటు గ్యాస్కు కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.