Home » Gannavaram
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం నాని.. భవన నిర్మిణ కార్మికులకు నగదు చెల్లింపులు చేయ్యకుండా ఎగకొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు రహదారిపై ఆందోళనకు దిగారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వెలగపూడి సచివాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, సూరంపల్లి గ్రామంలో గుర్రం శ్రీకాంత్ అనే యువకుడిని గ్రామస్తులు బంధించారు. ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన గుడ్డేటి ప్రసన్న (తల్లిలేని యువతి)ను ప్రేమలోకి దింపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన యువతి కూడా అతనిని ప్రేమించింది, అయితే...
తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందుకోసం శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరారు.
Andhrapradesh: వరద ముంపులో ఉండిపోయిన బెజవాడ ప్రజానీకాన్ని కాపాడేందుకు మరికొంత మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే కేంద్రం నుంచి 25 పవర్ బోట్లు, తొమ్మిది హెలికాప్టర్లతోపాటు వంద మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బెజవాడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొనగా.. తాజాగా పూణే నుంచి ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి.
భారీ వర్షాలకు గన్నవరం రూరల్ మండలం అంబాపురంలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు రక్షించాలంటూ ఆక్రందనలు పెడుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సైతం గ్రామానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం వేచి చూస్తున్నారు. ఫోన్ చేసినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బద్దా వెంకన్న(Badda Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందనే అహంకారంతో అప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023, ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటలపాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా..
Andhrapradesh: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్దమైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయనను ఏ1 ముద్దాయిగా చేర్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని ఖాకీలు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన కొంతమంది నుంచి స్టేట్మెంట్నుు పోలీసులు రికార్డ్ చేశారు.
రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) .. ఈయన వైసీపీకి (YSRCP) అస్సలు పడని మనిషి..! అలాంటిది ఈయన వైసీపీ కార్యకర్తల కంట పడితే.. ఇక వాళ్ల ఓవరాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! పోనీ ఆ ఓవరాక్షన్కు..